తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రం లీక్ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ ఓ వర్సీస్ పరీక్షలు ఈ నెల 12న జరగాల్సి ఉంది. ఈ నెల 15,16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామాకాల విషయమై పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ లో సెక్రటరీగా పని చేసే వ్యక్తికి పీఏగా పనిచేసే ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ యువతి కోసం ప్రవీణ్ ఈ పేపర్ ను లీక్ చేసినట్లు అనుమాస్తున్నారు. సదరు యువతి సోదరుడి కోసం ప్రవీణ్ ను ట్రాప్ చేసినట్టుగా పోలీసులు డౌట్ వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Huge Fire : భారీ అగ్ని ప్రమాదం.. రోడ్డునపడ్డ 100పైగా కుటుంబాలు
ప్రవీణ్ ను హానీ ట్రాప్ చేసిన యువతి సోదరుడి కోసం ఈ పేపర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. యువతి ప్రభుత్వ టీచర్ గా పని చేస్తుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. టీఎస్పీఎస్పీలో ఆడ్మిన్ విభాగంలో పనిచేసే రాజశేఖర్ ను ప్రశ్నాపత్రం గురించి ప్రవీణ్ అడిగారు.. సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్ లో క్వశ్చన్ పేపర్ ఉంటుందని రాజశేఖర్ ప్రవీణు తెలపడంతో దానిని దొంగలించినట్లు తెలుస్తోంది.
Also Read : Pranitha Subhash: ‘బాపుబొమ్మ’లా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
ఈ కంప్యూటర్ నుంచి ప్రవీణ్ డ్రైవ్ లో క్వశ్చన్ పేపర్ ను కాపీ చేసుకుని.. దాన్ని ప్రింట్ తీసి యువతికి పంపాడు. ఆ యువతి ఈ పేపర్ ను తనకు తెలిసిన మరో యువకుడికి పంపింది. ఈ యువకుడు మరో ముగ్గురికి షేర్ చేశాడు. ఈ క్రమంలో సుమారు రూ. 14 లక్షలను యువతి వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు. అయితే యువతి రూ.14 లక్షల్లో ప్రవీణ్ కు రూ. 10 లక్షలు ఇచ్చినట్లు ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. టీఎస్పీఎస్సీకి చెందిన కంప్యూటర్లు హ్యాక్ అయినట్లుగా తొలుత ప్రచారం సాగింది. అయితే టీఎస్పీఎస్సీ కంప్యూటర్స్ హ్యాక్ కాలేదని అధికారులు గుర్తించారు. పేపర్ లీకైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ యువతి కోసం ప్రవీణ్ ఈ పేపర్ ను లీక్ చేసినట్లుగా గుర్తించారు. ఈకేసులో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
