Site icon NTV Telugu

Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!

Hit And Run

Hit And Run

Hit and Run Accident: హైదరాబాద్‌ లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా వచ్చిన ఓ మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొనడంతో శ్యామ్ రాజ్ (32) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!

జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వస్తున్న వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ (WB 06B 7003) కలిగిన బెంజ్ కారు బ్రిడ్జిపై ఆగి ఉన్న శ్యామ్ రాజ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో కారు ఇంజన్ భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కారును కొంత దూరం తీసుకెళ్లి అదే కేబుల్ బ్రిడ్జిపై పార్క్ చేసి, డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం సమయంలో కారులో ఇద్దరు ఉన్నారు.

Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version