Uttar Pradesh: పెళ్లాన్ని చంపాడు.. పాతి పెట్టి.. పైన కాంక్రీట్ వేశాడు.. వీడిని కోర్టు ఏం చేసిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: భార్యను హత్య చేసిన కేసులో ఓ యువకుడికి యూపీలోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. యువకుడు తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టి, కాంక్రీట్ ఫ్లోర్తో కప్పి, తన అత్తమామలను కష్టాల్లోకి నెట్టాడు. మేజిస్ట్రేట్ విచారణలో మహిళ హత్య విషయం బయటపడింది. ఈ కేసులో బుధవారం జిల్లా, సెషన్స్ జడ్జి ఓ మహిళను హత్య చేసిన యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా ఈ కేసులో కోర్టు రూ.1లక్ష 25వేలు జరిమానా కూడా విధించింది.
వివరాల్లోకి వెళితే.. ఒరై నగరం కొత్వాలికి చెందిన సర్సౌఖి గ్రామానికి చెందిన కాళీచరణ్ – ఊర్మిళ దంపతుల కూతురు వినీతను నగరంలోని నయా రాంనగర్ ప్రాంతానికి చెందిన ఖేమ్రాజ్ కుమారుడు ప్రమోద్ కుమార్కు ఇచ్చి 2011 సంవత్సరంలో పెళ్లి చేశారు. ప్రమోద్ కుమార్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. 2018కి ముందు వినీత తన తల్లి ఊర్మిళతో నిత్యం మాట్లాడుతూ ఉండేది. కానీ తర్వాత తన కూతురు సడన్ గా ఆమెతో మాట్లాడడం మానేసింది. ఎప్పుడూ ఫోన్ చేసిన అల్లుడు ప్రమోద్ ఏదో ఓ సాకు చెప్పి దాటేసేవాడు.
Also Read
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
Read Also:Jawan: నయనతార అప్సెట్ అయ్యిందా? బాలీవుడ్ మీడియా బుద్ధి చూపించారు
ఇన్ని రోజులైనా కూతరు మాట్లాడకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రమోద్ను ఢిల్లీ నుంచి ఒరాయికి పిలిపించి కఠినంగా విచారించగా.. ప్రమోద్ నేరం అంగీకరించాడు. వినీతను హత్య చేసి.. తర్వాత ఇంట్లోని గదిలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని భూమిలో పూడ్చిపెట్టినట్లు ప్రమోద్ పోలీసులకు తెలిపాడు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు గదిలో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో పోలీసులకు అస్థిపంజరం కాకుండా చీర కూడా లభించింది. ఆ చీర తన కూతురు వినీతది అని ఊర్మిళ గుర్తించింది. మృతుడి తల్లి ఊర్మిళ ఫిర్యాదు మేరకు పోలీసులు 2020 జనవరి 4న ప్రమోద్పై హత్య కేసు నమోదు చేసి నిందితుడిని జైలుకు తరలించారు.
2 నెలల విచారణ అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. జిల్లా జడ్జి కోర్టులో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సాగిన విచారణలో 7 మంది వాంగ్మూలం, సాక్ష్యాధారాల ఆధారంగా, జిల్లా న్యాయమూర్తి లల్లూ సింగ్ బుధవారం ప్రమోద్ కుమార్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. ఇది కాకుండా రూ.1లక్ష 25వేలు జరిమానా విధించారు. శిక్ష ఖరారు చేసిన అనంతరం పోలీసులు ప్రమోద్ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో శిక్ష పడిన అనంతరం మృతురాలు వినీత తల్లి ఊర్మిళ మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత తనకు న్యాయం జరిగిందని తెలిపారు. వినీతకు ప్రస్తుతం ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిని ఊర్మిళ పెంచుతోంది.
Read Also:Crime :గణేష్ నిమజ్జనంలో అపశృతి .. ఇద్దరు యువకులు మృతి
తాజావార్తలు
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!