Uttar Pradesh: పెళ్లాన్ని చంపాడు.. పాతి పెట్టి.. పైన కాంక్రీట్ వేశాడు.. వీడిని కోర్టు ఏం చేసిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: భార్యను హత్య చేసిన కేసులో ఓ యువకుడికి యూపీలోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. యువకుడు తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఇంట్లో పాతిపెట్టి, కాంక్రీట్ ఫ్లోర్తో కప్పి, తన అత్తమామలను కష్టాల్లోకి నెట్టాడు. మేజిస్ట్రేట్ విచారణలో మహిళ హత్య విషయం బయటపడింది. ఈ కేసులో బుధవారం జిల్లా, సెషన్స్ జడ్జి ఓ మహిళను హత్య చేసిన యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా ఈ కేసులో కోర్టు రూ.1లక్ష 25వేలు జరిమానా కూడా విధించింది.
వివరాల్లోకి వెళితే.. ఒరై నగరం కొత్వాలికి చెందిన సర్సౌఖి గ్రామానికి చెందిన కాళీచరణ్ – ఊర్మిళ దంపతుల కూతురు వినీతను నగరంలోని నయా రాంనగర్ ప్రాంతానికి చెందిన ఖేమ్రాజ్ కుమారుడు ప్రమోద్ కుమార్కు ఇచ్చి 2011 సంవత్సరంలో పెళ్లి చేశారు. ప్రమోద్ కుమార్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. 2018కి ముందు వినీత తన తల్లి ఊర్మిళతో నిత్యం మాట్లాడుతూ ఉండేది. కానీ తర్వాత తన కూతురు సడన్ గా ఆమెతో మాట్లాడడం మానేసింది. ఎప్పుడూ ఫోన్ చేసిన అల్లుడు ప్రమోద్ ఏదో ఓ సాకు చెప్పి దాటేసేవాడు.
Also Read
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
Read Also:Jawan: నయనతార అప్సెట్ అయ్యిందా? బాలీవుడ్ మీడియా బుద్ధి చూపించారు
ఇన్ని రోజులైనా కూతరు మాట్లాడకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రమోద్ను ఢిల్లీ నుంచి ఒరాయికి పిలిపించి కఠినంగా విచారించగా.. ప్రమోద్ నేరం అంగీకరించాడు. వినీతను హత్య చేసి.. తర్వాత ఇంట్లోని గదిలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని భూమిలో పూడ్చిపెట్టినట్లు ప్రమోద్ పోలీసులకు తెలిపాడు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు గదిలో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో పోలీసులకు అస్థిపంజరం కాకుండా చీర కూడా లభించింది. ఆ చీర తన కూతురు వినీతది అని ఊర్మిళ గుర్తించింది. మృతుడి తల్లి ఊర్మిళ ఫిర్యాదు మేరకు పోలీసులు 2020 జనవరి 4న ప్రమోద్పై హత్య కేసు నమోదు చేసి నిందితుడిని జైలుకు తరలించారు.
2 నెలల విచారణ అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. జిల్లా జడ్జి కోర్టులో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సాగిన విచారణలో 7 మంది వాంగ్మూలం, సాక్ష్యాధారాల ఆధారంగా, జిల్లా న్యాయమూర్తి లల్లూ సింగ్ బుధవారం ప్రమోద్ కుమార్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు. ఇది కాకుండా రూ.1లక్ష 25వేలు జరిమానా విధించారు. శిక్ష ఖరారు చేసిన అనంతరం పోలీసులు ప్రమోద్ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో శిక్ష పడిన అనంతరం మృతురాలు వినీత తల్లి ఊర్మిళ మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత తనకు న్యాయం జరిగిందని తెలిపారు. వినీతకు ప్రస్తుతం ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిని ఊర్మిళ పెంచుతోంది.
Read Also:Crime :గణేష్ నిమజ్జనంలో అపశృతి .. ఇద్దరు యువకులు మృతి
తాజావార్తలు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!