Fraud: ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు ఇస్తే కమీషన్..! బ్యాంకు నోటీసులు చూసి షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud: రోజుకో తరహాలో మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. మోసాలు ఓవైపు.. సైబర్ నేరాలు మరోవైపు.. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మి ఏదైనా చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి.. తాజాగా, ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు ఇస్తే కమిషన్ ఇస్తానంటూ ఎరవేసి వారి పేరుపై కోట్ల రూపాయల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి పేద ప్రజలను నిలువునా ముంచిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెలుగు చూసింది. తమ పేరుపై ఉన్న లక్షలాది రూపాయలు అప్పులు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో పాటు వేధింపులు ఎక్కువ కావడంతో మోసపోయామని గుర్తించి ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు బాధితులు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భీమవరం సోనోవిజన్ లో పనిచేసే రత్నాకర్ అనే వ్యక్తి అమాయకులను టార్గెట్ గా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. పేద ప్రజల నుండి ఆధార్, పాన్ తీసుకొని ఫైనాన్స్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనిపించిన సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్ వారికి వస్తువులు ఇవ్వకుండా కమిషన్ రూపంలో కొంత నగదు చేతిలో పెట్టేవాడు. ఒకరికి తెలీకుండా మరొకరి దగ్గర ఇలా వందలమంది పేరుతో వస్తువులు కొనుగోలు చేసిన రత్నాకర్ వాటిని బయట అమ్ముకుని సొమ్ము కూడబెట్టుకున్నాడు. తమ బ్యాంకు వివరాలు ఇచ్చి కమిషన్ తీసుకున్న వారికి అనుమానం రాకుండా మొదటి ఈఎంఐ చెల్లించేవాడు. ఇలా భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో వందలాది మంది నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు మోసానికి పాల్పడిన రత్నాకర్ తర్వాతి కాలంలో వాయిదాలు చెల్లించడం మానేశాడు. వాయిదాలు చెల్లించాలంటూ ఆధార్ పాన్ కార్డులు ఇచ్చిన వ్యక్తులకు మెసేజ్లు వెళ్లడంతో మోసం పోయామని గుర్తించిన బాధితులకు తర్వాత కాలంలో ఫైనాన్స్ ఉద్యోగుల వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు భరించలేక అత్తిలి చెందిన బాధితులు ఆత్మహత్యకు సైతం ప్రయత్నించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సోనోవిజన్ ఉద్యోగి రత్నాకర్ చేసిన మోసాలపై అత్తిలి పోలీస్ స్టేషన్ లో జీరో FIR నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఘరానా మోసానికి పాల్పడిన రత్నకరపై సోనోవిజన్ సంస్థ సైతం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
Also Read
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..