Houthis: యూఎన్ సిబ్బందిని బంధించిన హౌతీలు.. బందీలు ఎందరంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthis: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హౌతీల ప్రధానమంత్రితో సహా అనేక మంది సీనియర్ కమాండర్లు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు రాజధాని సనా, హుదేయిదా అనే ఓడరేవు పట్టణంపై దాడి చేశారు. ఆదివారం ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసి 11 మంది ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడి తర్వాత ఐక్యరాజ్యసమితి కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయని యెమెన్ భద్రతా అధికారులు చెప్పారు.
READ ALSO: Kerala: ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
వారిని షరతులు లేకుండా విడుదల చేయాలి..
హౌతీ తిరుగుబాటుదారులు బందీలుగా చేసుకున్న వ్యక్తులు ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. హౌతీ తిరుగుబాటుదారులు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమం కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించి, సంస్థ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, కార్యాలయాలను కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ఈ ఘటన చాలా దారుణమని యెమెన్కు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి హన్స్ గ్రండ్బర్గ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను వెంటనే, ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రత్యేక రాయబారి హన్స్ గ్రండ్బర్గ్ మాట్లాడుతూ.. UN కార్యాలయంపై దాడి చేసి దాని ఉద్యోగులను బందీలుగా తీసుకోవడం సరైనది కాదని అన్నారు. హౌతీ తిరుగుబాటుదారుల చర్య యెమెన్ తీర్మానాన్ని ఉల్లంఘిస్తుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. నిజానికి యెమెన్లో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి సహాయ కార్మికులు గూఢచర్యం చేసి ఇజ్రాయెల్, అమెరికాకు సమాచారం అందిస్తున్నారని హౌతీ తిరుగుబాటుదారులు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, హౌతీ తిరుగుబాటుదారులు తమ పరిధిని విస్తరించారు. డ్రోన్లు, క్షిపణుల ద్వారా అనేక వాణిజ్య ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. తాము పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నామని, దీని కోసం ఇజ్రాయెల్పై దాడి చేస్తూనే ఉంటామని హౌతీలు స్పష్టం చేశారు.
READ ALSO: Shocking School Fees: బాబోయ్ స్కూల్ ఫీజులు.. అక్షరాల లక్షలు
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..