Rishi Sunak: రోగులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు వింత అనుభవం ఎదురైంది. రిషి సునాక్ శుక్రవారం సౌత్ లండన్లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ.. ఇక్కడ ఆస్పత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని ఆమెను ప్రశ్నించారు. ఆమె దానికి సమాధానం చెబుతూ.. బాగా చూసుకుంటున్నారని బదులిస్తూనే.. ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం చాలా తక్కువ వేతనాలు ఇస్తోందని, వాటిని చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. నర్సుల వేతనాలు పెంచాలని కోరారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పేలోపే.. ఆమె కల్పించుకుని ప్రయత్నించడం కాదని.. మరింత తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరముందని అనడంతో ఆశ్చర్యపోయిన సునాక్.. తప్పకుండా అని బదులిచ్చారు.
America: ఘోరం.. ఒకే ఇంట్లో 8 మృతదేహాలు.. అసలేం జరిగింది?
తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇటీవల దాదాపు 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది సమ్మెకు దిగాలని సిబ్బంది నిర్ణయించారు. దీనికోసం ఓటింగ్ కూడా నిర్వహించారు. సమ్మెకు వెళ్లేందుకు ఓటింగ్ నిర్వహించడం ఈ శతాబ్ద కాలంలో బ్రిటన్లో ఇదే తొలిసారి. పెరిగిపోతున్న ధరలకు తోడు, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వేతనాల్లో పెరుగుదల లేదని, అందుకే ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెలిపింది. జాతీయ వైద్య సేవల కింద బ్రిటన్లో 1948 నుంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సేవలకు కేటాయించిన బడ్జెట్లో మూడింట ఒక వంతును ఆరోగ్య సేవల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.