Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Home Ministry Orders Cbi Probe Into Arvind Kejriwals Residence Renovation Case

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌… ఆ కేసులో సీబీఐ దర్యాప్తుకు హోంశాఖ అనుమతి

Published Date :September 27, 2023 , 7:17 pm
By Mahesh Jakki
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌… ఆ కేసులో సీబీఐ దర్యాప్తుకు హోంశాఖ అనుమతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi CM Arvind Kejriwal Bungalow Renovation Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సీఎం నివాస పునరుద్ధరణ కేసులో సీబీఐ కేసు నమోదు చేయడమే కారణం. ఢిల్లీ సీఎం నివాసం పునరుద్ధరణలో జరిగిన కుంభకోణంపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. మే నెలలో ఢిల్లీ ఎల్‌జీ సీబీఐ డైరెక్ట్‌కు విచారణ కోరుతూ లేఖ రాశారు. దీని ఆధారంగానే సీబీఐ దర్యాప్తునకు హోంశాఖ అనుమతి ఇచ్చింది. నిజానికి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ జరిపిన విచారణ తర్వాత వెలుగులోకి వచ్చిన అక్రమాలకు సంబంధించిన అన్ని కోణాల్లో సీబీఐ ఇప్పుడు దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారంలో కాగ్‌ ప్రత్యేక ఆడిట్‌కు హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్ చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు బీజేపీ తన శక్తినంతా వినియోగించుకుందని ఆప్‌ ఆరోపిస్తోంది. నేడు దేశంలో విద్య, ఆరోగ్య రంగాలలో అద్భుతమైన కృషి చేస్తూ ఓట్లు అడుగుతున్నది ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. కానీ పేదలకు మంచి విద్య, అద్భుతమైన వైద్య సదుపాయాలు అందడం బీజేపీకి ఇష్టం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో బీజేపీ మత, కుల రాజకీయాలకు గండిపడుతుందన్నారు. ఈ కారణంగానే దేశంలోనే అత్యుత్తమ విద్యా, ఆరోగ్య శాఖ మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌లు జైలు పాలయ్యారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ముట్టడించేందుకు దర్యాప్తు సంస్థలన్నీ రంగంలోకి దిగాయన్నారు. అయితే ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులు అరవింద్ కేజ్రీవాల్‌పై ఉన్నాయని ఆప్‌ నేతలు పేర్కొ్న్నారు.

ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్‌పై 50కి పైగా కేసులు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారని ఆప్ తెలిపింది. వాటిలోంచి ఏమీ బయటకు రాలేదని వెల్లడించింది. దీని నుండి కూడా ఏమీ బయటకు రాదని పేర్కొంది. బీజేపీ ఎన్ని విచారణలు కోరుతున్నా అరవింద్ కేజ్రీవాల్ మాత్రం సామాన్యుల ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటారు. భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దుతామని అరవింద్ కేజ్రీవాల్ ప్రతినబూనారన్నారు. దీని కోసం ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని ఆప్‌ పేర్కొంది.

45 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసం సుందరీకరణ కోసం దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వివాదం చెలరేగింది. ఆరోపణల నేపథ్యంలో ఎల్‌జీ సక్సేనా ఈ అంశంపై నివేదిక సమర్పించాలని, అవకతవకలకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని, చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సీఎం నివాసాన్ని పునరుద్దరిస్తున్నారనే నెపంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చేసిన ఫిరాయింపులు/ ఉల్లంఘనల వివరాలతో కూడిన చీఫ్ సెక్రటరీ నివేదిక ఆధారంగా, ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించాలని సక్సేనా సీబీఐకి లేఖ రాశారు.

నివాసం కోసం కొనుగోలు చేసిన ఎనిమిది కొత్త కర్టెన్‌లలో ఒకదాని ధర రూ.7.94 లక్షలకు పైగా ఉండగా, చౌకైన కర్టెన్ ధర రూ.3.57 లక్షలు అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. వియత్నాం నుండి రూ. 1.15 కోట్ల విలువైన మార్బుల్‌ను తీసుకురాగా, ముందుగా నిర్మించిన చెక్క గోడలకు రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు సంబిత్‌ పాత్ర చెప్పారు. కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్‌పై దాడి చేసి, ఆయన నివాసానికి ఖర్చు చేసిన మొత్తం రూ. 171 కోట్లు అని, గతంలో నివేదించిన ప్రకారం రూ. 45 కోట్లు కాదని పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aam admi party
  • Arvind Kejriwal
  • Arvind Kejriwal Bungalow Renovation Case
  • CBI
  • Delhi CM

తాజావార్తలు

  • Polavaram Tiger Alert: పోలవరం జిల్లాలో పులి సంచారం.. గిరిజన గ్రామాల్లో ఆందోళన!

  • Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..

  • Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

  • Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ

  • UK Visa: బ్రిటన్ బాదుడు.. భారీగా పెంచేసిన వీసా ఛార్జీలు

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions