Vangalapudi Anitha: అమరావతి ప్రజలకు జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల వైస్సార్సీపీ నాయకుల మాటలు రాష్ట్ర గౌరవాన్ని భంగపరచేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అమరావతిని కించపరిచేలా పదాలను ఉపయోగించడంపై తీవ్ర అభ్యంతరకరం చేసారు. అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి అక్కసు.. మూడు రాజధానులు పేరుతో విషం కక్కారని హోం మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన మొదటి నుంచీ అమరావతిని నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు.
Read Also: Janasena: మట్టి తవ్వకాలలో రెండు వర్గాలుగా విడిపోయి వీధికెక్కిన జనసేన నేతలు.. ఆపై దాడులు..!
Also Read
- Monkey Control Tips: కోతులు ఇబ్బంది పెడుతున్నాయా..? శాశ్వతంగా తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు
- Sergio Gor: భారత్తో అమెరికా సంబంధాలపై సెర్గియా గోర్ కీలక వ్యాఖ్యలు
- Pakistan: జపాన్లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
అమరావతి సాధన పోరాటంలో 270 మంది చనిపోయారు. ఇప్పుడు పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతుంటే ఎందుకు ఓర్వలేకపోతున్నారు? అని ఆమె ప్రశ్నించారు. అమరావతిని వేశ్యల రాజధాని అని అభద్రంగా చెప్పే వారిని ప్రోత్సహించిన వారెవరో బయట పెట్టాలని ఆమె స్పష్టం చేశారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన మీటింగ్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించేలా మాట్లాడారని, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమంటే మహిళలను కించపరచడమా? అని అనిత ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పేరు దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు.
Read Also: French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్రదారులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. వారి పత్రిక, ఛానల్పై ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇక కృష్ణం రాజు కుమార్తెపై టీడీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు కూడా తప్పేనని చెప్పాను. ఆ పోస్టులను తొలగించమని సూచించానని అనిత చెప్పారు. ఒక వ్యక్తి చేసిన మూర్ఖపు వ్యాఖ్యలను ఖండించాలి. కానీ అమరావతి రైతులు, మహిళల మధ్యకి వెళ్లి నిజంగా చెప్పగల ధైర్యం ఎవరికి ఉందొ చూడాలి అంటూ విమర్శల దాడి చేశారు.
తాజావార్తలు
-
Monkey Control Tips: కోతులు ఇబ్బంది పెడుతున్నాయా..? శాశ్వతంగా తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు
-
Sergio Gor: భారత్తో అమెరికా సంబంధాలపై సెర్గియా గోర్ కీలక వ్యాఖ్యలు
-
Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
-
Pakistan: జపాన్లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!