HMPV Case: చైనాను అతలాకుతలం చేస్తున్న HMPV వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు నమోదు అయింది. 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తెలుస్తుంది. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు నమోదైంది. ఇక, దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయింది. రాష్ట్రంలోని ల్యాబ్లో ఈ పరీక్ష నిర్వహించలేదని చెప్పుకొచ్చింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చింది.. దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొనింది. అయితే, ఈ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ధ్రువీకరణ రాలేదు.
HMPV Virus: భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కొత్త వైరస్.. 8 ఏళ్ల చిన్నారికి నిర్ధారణ
- భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కొత్త వైరస్..
- బెంగళూరులో నమోదైన తొలి కేసు..
- 8 నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు నిర్థారణ..

Hmpv