Site icon NTV Telugu

Hira Multi Ventures : హైదరాబాద్‌లో బయటపడ్డ భారీ కార్పోరేట్ స్కాం

Hira Multy Ventures

Hira Multy Ventures

హైదరాబాద్ లో భారీ కార్పోరేట్ స్కాం బట్టబయలైంది. 200కోట్ల కంపెనీ షేర్స్ ను 10మంది కుటుంబ సభ్యులకు హీరా మల్టీ వెంచర్స్ యాజమాన్యం బదలాయించుకుంది. 15శాతం షేర్స్ ను అక్రమంగా హీరా మల్టీ కంపెనీ యాజమాన్యం 85శాతానికి పెంచుకుంది. సాధీ రాజవంశీకుల వద్ద కీలక వ్యక్తులమంటూ ప్రచారం చేసుకొని పెట్టుబడులు పెట్టించుకున్నారు. దీంతో బాధితులు నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ను ఆశ్రయించారు. చీట్ చేసి ఇల్లీగల్ గా షేర్స్ ట్రాన్ఫర్ జరిగిందని ఎన్‌సీఎల్‌టీ గుర్తించింది. దీంతో.. తిరిగి బాధితులకు షేర్స్ అప్పగించాలని హీరా మల్టీ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. ఎన్‌సీఎల్‌టీ తీర్పుతో బాధితులకు ఊరట లభించింది.
Also Read : Chegunta: ఆ ఊరికి ఏమైంది.. దీపావళి నుంచి 70మంది గ్రామస్తులకు వాంతులు విరేచనాలు

అయితే.. సౌదీకి చెందిన అబ్దుల్ రజాక్ బాగ్ధాధీ అలియాస్ అధీఅలీ పై హైదరాబాద్ లో పలు కేసులు నమోదయ్యాయి. గతంలో హీరా మల్టీ యాజమాన్యంపై హైదరాబాద్ లో సీఐడీ, ఈడీలో సైతం కేసులు నమోదయ్యాయి. సీఐడీ కేసులో గతంలో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయ్యింది. గతంలో.. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ కంచర్ల కంపెనీని 500కోట్ల మేరకు హీరా మల్టీ యాజమాన్యం మోసం చేసింది. వికారాబాద్ ఊటీ గోల్ఫ్ కోర్స్ కేసులో గతంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలతో హీరా కంపెనీపై క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్నారు బాధితులు. మినిస్ట్రీ ఆఫ్ కార్ఫోరేట్ అఫైర్స్, ఆర్‌ఓసీకి హీరా మల్టీ యాజమాన్యం పై ఫిర్యాదు చేయనున్నారు బాధితులు.

Exit mobile version