Sugar Price Hike: పండుగ సీజన్లో చేదెక్కిన చక్కెర.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Price Hike: రాబోయేది పండుగల సీజన్. ప్రతి పండుగకు స్వీట్లు చేసుకోవడం మన భారతీయులకు అలవాటు. కానీ వచ్చే పండుగలకు సామాన్యుడు స్వీట్లు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఖరీదైన చక్కెర స్వీట్లలోని తీపిని మసకబారుతుంది. చక్కెర ధరలు మండిపోతున్నాయి. చక్కెర ధర ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది వర్షాలు భారీ కురవడంతో చెరకు ఉత్పత్తి దెబ్బతినడంతో చక్కెర ధరలు భారీగా పెరిగాయి.
చెరకు ఉత్పత్తి తగ్గడం వల్ల చక్కెర మిల్లులు ఆందోళన చెందుతున్నాయని బాంబే షుగర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్ తెలిపారు. వర్షాభావ పరిస్థితులు పంటపై ప్రభావం చూపడంతో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చక్కెర మిల్లులు తక్కువ ధరలకు పంచదారను విక్రయించేందుకు సిద్ధంగా లేవు. అక్టోబర్లో ప్రారంభమయ్యే కొత్త సీజన్లో 3.3 శాతం క్షీణతతో 31.7 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. మొత్తం ఉత్పత్తిలో సగం కర్ణాటక, మహారాష్ట్రలలో చెరకు పంట బాగా దెబ్బతింది.
Also Read
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
Read Also:Kiara Adwani : కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధం.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతిపై నిషేధం విధించే అవకాశం ఉందని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోధుమలు, బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. అక్టోబర్ నెల నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్లో చక్కెర మిల్లుల ఎగుమతిని నిషేధించే నిర్ణయం తీసుకోవచ్చు. ఇదే జరిగితే ఏడేళ్లలో చక్కెర ఎగుమతిపై నిషేధం విధించడం ఇదే తొలిసారి అవుతుంది. దేశీయ మార్కెట్లో చక్కెర అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. అయితే, చక్కెర ఉత్పత్తి క్షీణించడం వల్ల ప్రభుత్వం ఎగుమతులను నిషేధిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుంది.
చక్కెర ఉత్పత్తి తగ్గింపు ప్రభావం ఇప్పటికే ధరలపై కనిపిస్తోంది. జూలై 1న రిటైల్ మార్కెట్లో చక్కెర సగటు ధర కిలోకు రూ. 42.98 ఉండగా, సెప్టెంబర్ 5 నాటికి సగటున కిలో రూ.43.42కి పెరిగిందని ప్రభుత్వ గణాంకాల చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది జనవరి 1 నాటికి కిలో రూ.41.45గా ఉంది. పంచదార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే బిస్కెట్ల నుంచి చాక్లెట్లు, శీతల పానీయాలు, స్వీట్ల వరకు అన్నీ ఖరీదు కానున్నాయి.
Read Also:Talasani Srinivas Yadav : భారీ వర్షాలు ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి..
తాజావార్తలు
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!