Sugar Price Hike: పండుగ సీజన్లో చేదెక్కిన చక్కెర.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Price Hike: రాబోయేది పండుగల సీజన్. ప్రతి పండుగకు స్వీట్లు చేసుకోవడం మన భారతీయులకు అలవాటు. కానీ వచ్చే పండుగలకు సామాన్యుడు స్వీట్లు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఖరీదైన చక్కెర స్వీట్లలోని తీపిని మసకబారుతుంది. చక్కెర ధరలు మండిపోతున్నాయి. చక్కెర ధర ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది వర్షాలు భారీ కురవడంతో చెరకు ఉత్పత్తి దెబ్బతినడంతో చక్కెర ధరలు భారీగా పెరిగాయి.
చెరకు ఉత్పత్తి తగ్గడం వల్ల చక్కెర మిల్లులు ఆందోళన చెందుతున్నాయని బాంబే షుగర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్ తెలిపారు. వర్షాభావ పరిస్థితులు పంటపై ప్రభావం చూపడంతో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చక్కెర మిల్లులు తక్కువ ధరలకు పంచదారను విక్రయించేందుకు సిద్ధంగా లేవు. అక్టోబర్లో ప్రారంభమయ్యే కొత్త సీజన్లో 3.3 శాతం క్షీణతతో 31.7 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. మొత్తం ఉత్పత్తిలో సగం కర్ణాటక, మహారాష్ట్రలలో చెరకు పంట బాగా దెబ్బతింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also:Kiara Adwani : కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధం.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతిపై నిషేధం విధించే అవకాశం ఉందని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోధుమలు, బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. అక్టోబర్ నెల నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్లో చక్కెర మిల్లుల ఎగుమతిని నిషేధించే నిర్ణయం తీసుకోవచ్చు. ఇదే జరిగితే ఏడేళ్లలో చక్కెర ఎగుమతిపై నిషేధం విధించడం ఇదే తొలిసారి అవుతుంది. దేశీయ మార్కెట్లో చక్కెర అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. అయితే, చక్కెర ఉత్పత్తి క్షీణించడం వల్ల ప్రభుత్వం ఎగుమతులను నిషేధిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుంది.
చక్కెర ఉత్పత్తి తగ్గింపు ప్రభావం ఇప్పటికే ధరలపై కనిపిస్తోంది. జూలై 1న రిటైల్ మార్కెట్లో చక్కెర సగటు ధర కిలోకు రూ. 42.98 ఉండగా, సెప్టెంబర్ 5 నాటికి సగటున కిలో రూ.43.42కి పెరిగిందని ప్రభుత్వ గణాంకాల చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది జనవరి 1 నాటికి కిలో రూ.41.45గా ఉంది. పంచదార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే బిస్కెట్ల నుంచి చాక్లెట్లు, శీతల పానీయాలు, స్వీట్ల వరకు అన్నీ ఖరీదు కానున్నాయి.
Read Also:Talasani Srinivas Yadav : భారీ వర్షాలు ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!