Sugar Price Hike: పండుగ సీజన్లో చేదెక్కిన చక్కెర.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన ధర
Sugar Price Hike: రాబోయేది పండుగల సీజన్. ప్రతి పండుగకు స్వీట్లు చేసుకోవడం మన భారతీయులకు అలవాటు. కానీ వచ్చే పండుగలకు సామాన్యుడు స్వీట్లు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఖరీదైన చక్కెర స్వీట్లలోని తీపిని మసకబారుతుంది. చక్కెర ధరలు మండిపోతున్నాయి. చక్కెర ధర ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది వర్షాలు భారీ కురవడంతో చెరకు ఉత్పత్తి దెబ్బతినడంతో చక్కెర ధరలు భారీగా పెరిగాయి.
చెరకు ఉత్పత్తి తగ్గడం వల్ల చక్కెర మిల్లులు ఆందోళన చెందుతున్నాయని బాంబే షుగర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్ తెలిపారు. వర్షాభావ పరిస్థితులు పంటపై ప్రభావం చూపడంతో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చక్కెర మిల్లులు తక్కువ ధరలకు పంచదారను విక్రయించేందుకు సిద్ధంగా లేవు. అక్టోబర్లో ప్రారంభమయ్యే కొత్త సీజన్లో 3.3 శాతం క్షీణతతో 31.7 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. మొత్తం ఉత్పత్తిలో సగం కర్ణాటక, మహారాష్ట్రలలో చెరకు పంట బాగా దెబ్బతింది.
Also Read
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
Read Also:Kiara Adwani : కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధం.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతిపై నిషేధం విధించే అవకాశం ఉందని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోధుమలు, బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. అక్టోబర్ నెల నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్లో చక్కెర మిల్లుల ఎగుమతిని నిషేధించే నిర్ణయం తీసుకోవచ్చు. ఇదే జరిగితే ఏడేళ్లలో చక్కెర ఎగుమతిపై నిషేధం విధించడం ఇదే తొలిసారి అవుతుంది. దేశీయ మార్కెట్లో చక్కెర అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. అయితే, చక్కెర ఉత్పత్తి క్షీణించడం వల్ల ప్రభుత్వం ఎగుమతులను నిషేధిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుంది.
చక్కెర ఉత్పత్తి తగ్గింపు ప్రభావం ఇప్పటికే ధరలపై కనిపిస్తోంది. జూలై 1న రిటైల్ మార్కెట్లో చక్కెర సగటు ధర కిలోకు రూ. 42.98 ఉండగా, సెప్టెంబర్ 5 నాటికి సగటున కిలో రూ.43.42కి పెరిగిందని ప్రభుత్వ గణాంకాల చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది జనవరి 1 నాటికి కిలో రూ.41.45గా ఉంది. పంచదార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే బిస్కెట్ల నుంచి చాక్లెట్లు, శీతల పానీయాలు, స్వీట్ల వరకు అన్నీ ఖరీదు కానున్నాయి.
Read Also:Talasani Srinivas Yadav : భారీ వర్షాలు ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి..
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!