Sugar Price Hike: పండుగ సీజన్లో చేదెక్కిన చక్కెర.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Price Hike: రాబోయేది పండుగల సీజన్. ప్రతి పండుగకు స్వీట్లు చేసుకోవడం మన భారతీయులకు అలవాటు. కానీ వచ్చే పండుగలకు సామాన్యుడు స్వీట్లు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఖరీదైన చక్కెర స్వీట్లలోని తీపిని మసకబారుతుంది. చక్కెర ధరలు మండిపోతున్నాయి. చక్కెర ధర ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది వర్షాలు భారీ కురవడంతో చెరకు ఉత్పత్తి దెబ్బతినడంతో చక్కెర ధరలు భారీగా పెరిగాయి.
చెరకు ఉత్పత్తి తగ్గడం వల్ల చక్కెర మిల్లులు ఆందోళన చెందుతున్నాయని బాంబే షుగర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్ తెలిపారు. వర్షాభావ పరిస్థితులు పంటపై ప్రభావం చూపడంతో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చక్కెర మిల్లులు తక్కువ ధరలకు పంచదారను విక్రయించేందుకు సిద్ధంగా లేవు. అక్టోబర్లో ప్రారంభమయ్యే కొత్త సీజన్లో 3.3 శాతం క్షీణతతో 31.7 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. మొత్తం ఉత్పత్తిలో సగం కర్ణాటక, మహారాష్ట్రలలో చెరకు పంట బాగా దెబ్బతింది.
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
Read Also:Kiara Adwani : కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధం.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతిపై నిషేధం విధించే అవకాశం ఉందని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోధుమలు, బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. అక్టోబర్ నెల నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్లో చక్కెర మిల్లుల ఎగుమతిని నిషేధించే నిర్ణయం తీసుకోవచ్చు. ఇదే జరిగితే ఏడేళ్లలో చక్కెర ఎగుమతిపై నిషేధం విధించడం ఇదే తొలిసారి అవుతుంది. దేశీయ మార్కెట్లో చక్కెర అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. అయితే, చక్కెర ఉత్పత్తి క్షీణించడం వల్ల ప్రభుత్వం ఎగుమతులను నిషేధిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుంది.
చక్కెర ఉత్పత్తి తగ్గింపు ప్రభావం ఇప్పటికే ధరలపై కనిపిస్తోంది. జూలై 1న రిటైల్ మార్కెట్లో చక్కెర సగటు ధర కిలోకు రూ. 42.98 ఉండగా, సెప్టెంబర్ 5 నాటికి సగటున కిలో రూ.43.42కి పెరిగిందని ప్రభుత్వ గణాంకాల చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది జనవరి 1 నాటికి కిలో రూ.41.45గా ఉంది. పంచదార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే బిస్కెట్ల నుంచి చాక్లెట్లు, శీతల పానీయాలు, స్వీట్ల వరకు అన్నీ ఖరీదు కానున్నాయి.
Read Also:Talasani Srinivas Yadav : భారీ వర్షాలు ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి..
తాజావార్తలు
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..