Sugar Price Hike: పండుగ సీజన్లో చేదెక్కిన చక్కెర.. ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Price Hike: రాబోయేది పండుగల సీజన్. ప్రతి పండుగకు స్వీట్లు చేసుకోవడం మన భారతీయులకు అలవాటు. కానీ వచ్చే పండుగలకు సామాన్యుడు స్వీట్లు చేసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఖరీదైన చక్కెర స్వీట్లలోని తీపిని మసకబారుతుంది. చక్కెర ధరలు మండిపోతున్నాయి. చక్కెర ధర ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది వర్షాలు భారీ కురవడంతో చెరకు ఉత్పత్తి దెబ్బతినడంతో చక్కెర ధరలు భారీగా పెరిగాయి.
చెరకు ఉత్పత్తి తగ్గడం వల్ల చక్కెర మిల్లులు ఆందోళన చెందుతున్నాయని బాంబే షుగర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ జైన్ తెలిపారు. వర్షాభావ పరిస్థితులు పంటపై ప్రభావం చూపడంతో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చక్కెర మిల్లులు తక్కువ ధరలకు పంచదారను విక్రయించేందుకు సిద్ధంగా లేవు. అక్టోబర్లో ప్రారంభమయ్యే కొత్త సీజన్లో 3.3 శాతం క్షీణతతో 31.7 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. మొత్తం ఉత్పత్తిలో సగం కర్ణాటక, మహారాష్ట్రలలో చెరకు పంట బాగా దెబ్బతింది.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Read Also:Kiara Adwani : కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధం.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతిపై నిషేధం విధించే అవకాశం ఉందని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోధుమలు, బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. అక్టోబర్ నెల నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్లో చక్కెర మిల్లుల ఎగుమతిని నిషేధించే నిర్ణయం తీసుకోవచ్చు. ఇదే జరిగితే ఏడేళ్లలో చక్కెర ఎగుమతిపై నిషేధం విధించడం ఇదే తొలిసారి అవుతుంది. దేశీయ మార్కెట్లో చక్కెర అవసరాలను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. అయితే, చక్కెర ఉత్పత్తి క్షీణించడం వల్ల ప్రభుత్వం ఎగుమతులను నిషేధిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుంది.
చక్కెర ఉత్పత్తి తగ్గింపు ప్రభావం ఇప్పటికే ధరలపై కనిపిస్తోంది. జూలై 1న రిటైల్ మార్కెట్లో చక్కెర సగటు ధర కిలోకు రూ. 42.98 ఉండగా, సెప్టెంబర్ 5 నాటికి సగటున కిలో రూ.43.42కి పెరిగిందని ప్రభుత్వ గణాంకాల చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది జనవరి 1 నాటికి కిలో రూ.41.45గా ఉంది. పంచదార ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే బిస్కెట్ల నుంచి చాక్లెట్లు, శీతల పానీయాలు, స్వీట్ల వరకు అన్నీ ఖరీదు కానున్నాయి.
Read Also:Talasani Srinivas Yadav : భారీ వర్షాలు ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?