రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ను తప్పుదోవ పట్టించారా లేదా.. అని చెన్నమనేని ప్రశ్నించిన హైకోర్టు… కోర్టు ను తప్పుదోవ పట్టించునే వాళ్లకు ఉపషమనం ఎందుకు కల్పించాలని వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జర్మనీ పౌరసత్వం తో పోటీ చేసారన్న హైకోర్టు.. జర్మనీ పౌరసత్వం తోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించారు. 2018 ఎన్నికల సందర్భంగా జర్మనీ పాస్ పోర్ట్ మీద ప్రయాణం చేసారని సీనియర్ కౌన్సిల్ న్యాయవాది రవి కిరణ్ రావు కోర్టుకు తెలిపారు. 2019 లో OCI కార్డు కు అప్లై చేశారని సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ కోర్టు కు తెలిపారు. 2019 సెప్టెంబర్ లో OCI కార్డు తీసుకునేటప్పుడు జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడన్న సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ కోర్టుకు తెలిపారు. గత సంవత్సర కాలం లో చెన్నమనేని ప్రయాణాలు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంకు, చెన్నమనేని కు హైకోర్టు ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారం కు వాయిదా వేసింది హైకోర్టు.
Chennamaneni Ramesh Babu : మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ…
![Mla Ramesh Babu](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/03/MLA-Ramesh-Babu.jpg)
Mla Ramesh Babu