Hezbollah Enters Iran-Israel War: ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమెరికా- ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మృతిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ ఇచ్చింది.. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హిజ్జుల్లా గ్రూప్ దాడికి దిగింది.. నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా టార్గెట్గా హిజ్బుల్లా తీవ్రవాదుల ఎటాక్ చేస్తున్నారు.. ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించింది.. సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఎటాక్ చేస్తోంది.. 2024లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.. అయితే.. తాజాగా ఖమేనీ మృతి తర్వాత మళ్లీ దాడులు మొదలయ్యాయి..
లెబనాన్ భూభాగం నుంచి ప్రయోగించిన రాకెట్లు, డ్రోన్లు సోమవారం తెల్లవారుజామున ఉత్తర ఇజ్రాయెల్ అంతటా వ్యాపించాయి. ఇరాన్కు మద్దతుగా నిలిచిన హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ ఈ దాడుల్లో పాల్గొంటున్నట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి ఒకటి గంట దాటిన వెంటనే ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా నగరం, పరిసర ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ప్రారంభంలో ఈ రాకెట్ దాడులు ఇరాన్ నుంచే జరిగాయని అనుమానించినప్పటికీ, తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పష్టత ఇచ్చాయి. ఈ దాడుల మూలం లెబనాన్ అని అధికారికంగా ప్రకటించాయి. సైనిక వర్గాల సమాచారం ప్రకారం, ప్రయోగించిన రాకెట్లలో ఒకటిని గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మరికొన్ని రాకెట్లు ఖాళీ ప్రదేశాల్లో పడేలా అనుమతించబడినట్లు తెలిపారు. దీంతో పెద్దగా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు.
