Site icon NTV Telugu

Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్

Tollywood

Tollywood

సినిమాకు ముందు పీక్స్ ప్రమోషన్స్ చేసి.. రిలీజయ్యాక.. రిజల్ట్ ఎలా ఉన్నా ప్రచారాలను లైట్ తీసుకుంటారు. మహా అయితే సక్సెస్ మీట్ లేదా థాంక్స్ మీట్ నిర్వహించి సైలెంట్ అయిపోతారు. ఇప్పటి వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ మూస ధోరణికి స్వస్తి పలికేస్తున్నారు మన హీరోలు. రిలీజ్ తర్వాత స్ట్రాంగ్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. థియేటర్స్‌కు ఫుట్ ఫాల్స్ పెంచేందుకు స్ట్రాటజికల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అవి సినిమాకు ప్లస్ అవుతున్నాయి కూడా. రీసెంట్లీ వచ్చిన కపుల్ ఫ్రెండ్లీనే బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ.. డార్లింగ్ ఇంటర్వ్యూ మరింత హైప్ తెచ్చి, కలెక్షన్స్ పెరగడానికి కారణమైంది.

తన వాళ్ల సినిమాలంటే ముందే ప్రమోషన్ చేసే ప్రభాస్.. బైకర్‌కు కూడా రిలీజ్‌కు ముందే ప్రచారాన్ని కంప్లీట్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేశాడు శర్వానంద్. సుమతో పాటు అమలతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఎక్కడా సినిమాను స్పాయిలర్ చేయకుండా.. కొన్ని హైలెట్ ఎపిసోడ్స్ గురించి ప్రస్తావిస్తూ.. మూవీపై క్యూరియస్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అడివిశేష్ డెకాయిట్ డెకాయిట్‌కు రిలీజ్‌కు ముందు పీక్స్ ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లతో చిట్ చాట్ నిర్వహించాడు. తాజాగా నాని రంగంలోకి దిగాడు. హిట్ సిరీస్ హీరోలిద్దరూ చిన్న ఇంటరాక్షన్ కండక్ట్ చేశారు. ఇలా మూవీ రిలీజ్ ముందు కన్నా.. విడుదలయ్యాక ప్రమోషన్స్‌పై ఫుల్ ఫోకస్ చేస్తూ.. థియేటర్స్‌కు ఆడియన్స్‌ను పుల్ చేసేందుకు కష్టపడుతున్నారు.

Exit mobile version