Argentina: భారీ వర్షాల దెబ్బకి 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు
- అర్జెంటీనాలో కురుస్తున్న భారీ వర్షాలు.
- వరదలకు 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు
- గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు.
Argentina: అర్జెంటీనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలు మంది గల్లంతయ్యారు. అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. అర్జెంటీనాలోని తూర్పు తీరంలోని బహియా బ్లాంకా నగరంలో వర్షాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. గత రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ వర్షానికి వచ్చిన వరద నీటిలో అనేక మంది గల్లంతయ్యారు. ప్రభుత్వ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, రాజధాని బ్యూనస్ అయర్స్కు దక్షిణంగా ఉన్న బహియా బ్లాంకా నగరం నుంచి 1,450 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Also: MLA Quota MLC elections: నేడు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. అసంతృప్తులకు బుజ్జగింపులు..!
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
గత రెండు రోజుల్లో బహియా బ్లాంకాలో సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సాధారణంగా అక్కడి సగటు నెలవారీ వర్షపాతం సుమారు 129 మిల్లీమీటర్లు మాత్రమే. అయితే, రాబోయే 72 గంటల పాటు వర్షం కురిసే అవకాశం లేదని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం వరదల కారణంగా 10 మంది మృతి చెందారని ప్రకటించిన అధికారులు, ఆదివారం ఈ సంఖ్య 16కి చేరుకున్నట్లు వెల్లడించారు. బహియా బ్లాంకా నగరంలోని మేయర్ కార్యాలయం ప్రకారం, మరిన్ని ప్రాణ నష్టాలు జరిగే అవకాశముందని వెల్లడించారు. రాజధాని బ్యూనస్ అయర్స్ నుండి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరంలో సుమారు 3.5 లక్షల మంది జనాభా ఉంది.
Read Also: Final Judgement: ప్రణయ్ పరువు హత్య కేసు.. నేడే తుది తీర్పు
తీవ్రంగా ముంచుకొచ్చిన వరద నీటిలో చిక్కుకున్న ఓ కారులో ఐదుగురు జల్ సమాధి అయ్యారు. ప్రొవిన్షియల్ సెక్యూరిటీ మంత్రి జేవియర్ అలొన్సో తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ప్రారంభమైన వర్షం కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో సుమారు 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణంగా బహియా బ్లాంకాలో సంవత్సరమంతా వచ్చే వర్షపాతంతో సమానమని వెల్లడించారు. సెక్యూరిటీ మంత్రి బుల్రిచ్, రక్షణ మంత్రి లూయిస్ పెట్రీ తాకిడికి గురైన ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రయత్నించారు. అయితే, వారి పర్యటన ఆలస్యంగా జరిగిందన్న కారణంగా స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!