Telangana Reservoirs: నిండుకుండల్లా ప్రాజెక్ట్స్.. భారీగా చేరుతున్న వరద నీరు
- తెలంగాణ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం
- నిండుకుండల్లా సింగూరు, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్
- వరద నీటితో పొంగిపొర్లుతున్న జలాశయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Projects: తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. దీనితో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 158 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 94,383 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 96,003 క్యూసెక్కులను బయటకు పంపుతున్నారు. 29.917 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 18.237 టీఎంసీల నీరు ఉంది.
PM Modi: పాక్ పై భారత్ సంచలన విజయం.. పీఎం మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 39 గేట్లను ఎత్తివేసి 4,10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 3,40,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 1091 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి, ప్రస్తుతం 1083.30 అడుగుల వద్ద ఉంది. 80.5 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి, ప్రస్తుతం 54.623 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
TGSRTC : రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఊపు.. రూ.108.02 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,50,244 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 21 గేట్లను ఎత్తివేసి 1,51,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1401.22 అడుగుల వద్ద ఉంది. అలాగే, 17.802 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి ప్రస్తుతం 12.736 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టులోని 26 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5,86,379 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తాన్ని బయటకు పంపుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 585.50 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 44.3 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!