Telangana Reservoirs: నిండుకుండల్లా ప్రాజెక్ట్స్.. భారీగా చేరుతున్న వరద నీరు
- తెలంగాణ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం
- నిండుకుండల్లా సింగూరు, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్
- వరద నీటితో పొంగిపొర్లుతున్న జలాశయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Projects: తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. దీనితో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 158 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 94,383 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 96,003 క్యూసెక్కులను బయటకు పంపుతున్నారు. 29.917 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం 18.237 టీఎంసీల నీరు ఉంది.
PM Modi: పాక్ పై భారత్ సంచలన విజయం.. పీఎం మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Also Read
- Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
- MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
ఇక నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 39 గేట్లను ఎత్తివేసి 4,10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 3,40,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 1091 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి, ప్రస్తుతం 1083.30 అడుగుల వద్ద ఉంది. 80.5 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి, ప్రస్తుతం 54.623 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
TGSRTC : రాష్ట్రంలో ఆర్టీసీకి కొత్త ఊపు.. రూ.108.02 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,50,244 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 21 గేట్లను ఎత్తివేసి 1,51,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1401.22 అడుగుల వద్ద ఉంది. అలాగే, 17.802 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి ప్రస్తుతం 12.736 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టులోని 26 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5,86,379 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తాన్ని బయటకు పంపుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 585.50 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 44.3 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!