Crop Damage: భారీ వర్షాలతో అన్నదాతకు తీవ్ర నష్టం
Crop Damage: ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. లంకగ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పొలాలన్నీ నీటమునిగిపోయాయి. ధాన్యం నీటిలో తడిసిముద్దైంది. అరటి, బొప్పాయి, పత్తి పంటలు నాశనమయ్యాయి. చెట్లు నేలమట్టమై…కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయంలో వచ్చిన మిచౌంగ్ తుఫాన్..తమను నిండా ముంచిందని వాపోతున్నారు రైతులు.
అటు…ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులను తుఫాన్ నిండా ముంచేసింది. భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో 8వేల ఎకరాల్లో వరి నీట మునిగిపోయింది. ఎకరాకు 50 వేలు పెట్టుబడి పెట్టిన పంట…నాశనం అయిపోయిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇటు కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోసిన వరి ధాన్యం…పొలంలో ఉండగానే భారీ వర్షం కురవడంతో తడిగి ముద్దయ్యింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. వడ్లమన్నాడులో తుఫాన్ కారణంగా నీటమునిగిన వరిపొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. తమ ప్రాంతంలో పంట నష్టపోయిన రైతుల పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు కొడాలి నాని. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఎం జగన్ ఆదుకుంటారని ఆయనన్నారు.
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ... 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
- Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించనున్నారు సీఎం జగన్. బాపట్లతో పాటు తిరుపతి జిల్లా గూడూరుతో సీఎం పర్యటిస్తారు. కోస్తాలో తుఫాన్ బీభత్సాన్ని, పెద్దమొత్తంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. తుఫాన్ అప్రమత్తత చర్యల్లో భాగంగా అధికారుల పనితీరు గురించి బాధితులనే అడిగి తెలుసుకుంటానని బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో… శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం జగన్.
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో