Crop Damage: భారీ వర్షాలతో అన్నదాతకు తీవ్ర నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crop Damage: ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. లంకగ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పొలాలన్నీ నీటమునిగిపోయాయి. ధాన్యం నీటిలో తడిసిముద్దైంది. అరటి, బొప్పాయి, పత్తి పంటలు నాశనమయ్యాయి. చెట్లు నేలమట్టమై…కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయంలో వచ్చిన మిచౌంగ్ తుఫాన్..తమను నిండా ముంచిందని వాపోతున్నారు రైతులు.
అటు…ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులను తుఫాన్ నిండా ముంచేసింది. భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో 8వేల ఎకరాల్లో వరి నీట మునిగిపోయింది. ఎకరాకు 50 వేలు పెట్టుబడి పెట్టిన పంట…నాశనం అయిపోయిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇటు కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోసిన వరి ధాన్యం…పొలంలో ఉండగానే భారీ వర్షం కురవడంతో తడిగి ముద్దయ్యింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. వడ్లమన్నాడులో తుఫాన్ కారణంగా నీటమునిగిన వరిపొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. తమ ప్రాంతంలో పంట నష్టపోయిన రైతుల పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు కొడాలి నాని. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఎం జగన్ ఆదుకుంటారని ఆయనన్నారు.
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించనున్నారు సీఎం జగన్. బాపట్లతో పాటు తిరుపతి జిల్లా గూడూరుతో సీఎం పర్యటిస్తారు. కోస్తాలో తుఫాన్ బీభత్సాన్ని, పెద్దమొత్తంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. తుఫాన్ అప్రమత్తత చర్యల్లో భాగంగా అధికారుల పనితీరు గురించి బాధితులనే అడిగి తెలుసుకుంటానని బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో… శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం జగన్.
తాజావార్తలు
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!