Crop Damage: భారీ వర్షాలతో అన్నదాతకు తీవ్ర నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crop Damage: ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. లంకగ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. భారీ వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పొలాలన్నీ నీటమునిగిపోయాయి. ధాన్యం నీటిలో తడిసిముద్దైంది. అరటి, బొప్పాయి, పత్తి పంటలు నాశనమయ్యాయి. చెట్లు నేలమట్టమై…కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయంలో వచ్చిన మిచౌంగ్ తుఫాన్..తమను నిండా ముంచిందని వాపోతున్నారు రైతులు.
అటు…ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులను తుఫాన్ నిండా ముంచేసింది. భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో 8వేల ఎకరాల్లో వరి నీట మునిగిపోయింది. ఎకరాకు 50 వేలు పెట్టుబడి పెట్టిన పంట…నాశనం అయిపోయిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇటు కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోసిన వరి ధాన్యం…పొలంలో ఉండగానే భారీ వర్షం కురవడంతో తడిగి ముద్దయ్యింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పర్యటించారు. వడ్లమన్నాడులో తుఫాన్ కారణంగా నీటమునిగిన వరిపొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. తమ ప్రాంతంలో పంట నష్టపోయిన రైతుల పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు కొడాలి నాని. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఎం జగన్ ఆదుకుంటారని ఆయనన్నారు.
Also Read
- కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
- Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క 'సెల్ఫీ వీడియో'తో అకౌంట్ రికవర్!
- Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించనున్నారు సీఎం జగన్. బాపట్లతో పాటు తిరుపతి జిల్లా గూడూరుతో సీఎం పర్యటిస్తారు. కోస్తాలో తుఫాన్ బీభత్సాన్ని, పెద్దమొత్తంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. తుఫాన్ అప్రమత్తత చర్యల్లో భాగంగా అధికారుల పనితీరు గురించి బాధితులనే అడిగి తెలుసుకుంటానని బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో చెప్పారు ముఖ్యమంత్రి. ఈ క్రమంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో… శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం జగన్.
తాజావార్తలు
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
-
Google Security: పాస్వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!
-
Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
-
Delhi Police: విద్యార్థి ఆందోళనల ఎఫెక్ట్.. పోలీసులందరి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!