HDFC Bank: బ్యాంక్ కొత్త స్కీమ్..రూ. 5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం ఎన్నెన్నో కొత్త పథకాలను అమలు చేస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ ల వల్ల జనాలకు మంచిది లాభాలు వస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధిక వడ్డీ రేట్లు అందించేందుకు ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎఫ్డీ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ స్కీమ్. ఈ కొత్త పథకం గడువు జులై 7, 2023తో ముగియనుంది. ఇప్పటికే గడువు ఇప్పటికే చాలా సార్లు పొడిగించిన విషయం తెలిసిందే.. అందుకే ఎక్కువ వడ్డీ కోరుకునే వారు ఈ పథకంలో ఇప్పుడే డిపాజిట్ చేయడం ద్వారా మంచి వడ్డీని పొందవచ్చు..
ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ పథకం ద్వారా కస్టమర్లు ఇతర పథకాలతో పోలిస్తే అదనపు వడ్డీ రేట్లను పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లు 0.75 శాతం వరకు అదనపు వడ్డీ పొందే వీలుంటుంది. జనరల్ కస్టమర్లతో పోలిస్తే మాములుగా సీనియర్లకు 0.50 శాతం అదనపు వడ్డీ ఇస్తాయి.. ఈ స్కీమ్ వల్ల మరో 0.25 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తుంది.. ఇకపోతే ఈ పథకాన్ని మే 18, 2020న తొలిసారి ప్రవేశపెట్టారు. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్తో ఇందులో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. అందువల్ల అధిక రాబడి కోరుకునే కస్టమర్లకు ఈ పథకం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు సాధారణంగా 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్లపై 3.5 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ రేట్లు కల్పిస్తోంది. టెన్యూర్లను బట్టి ఈ వడ్డీ రేట్లు మారుతుంటాయి. గరిష్ఠంగా 35 నెలల టెన్యూర్పై 7.7 శాతం, 55 నెలల టెన్యూర్లపై 7.75 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. 7.75 శాతం వడ్డీ రేటు ప్రకారం చూసుకుంటే పదేళ్ల టెన్యూర్లో మీ డబ్బులు రెండింతలు అవుతాయి. అంటే రూ. 5 లక్షలు పెట్టినట్లయితే మీ డబ్బులు మెచ్యూరిటీ నాటికి రూ. 10 లక్షలు వస్తాయి.. మీరు పెట్టే ప్రీమీయం ను బట్టి వడ్డీ మారుతుంది. ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు చివరికి రెండు లక్షలు చేతికి వస్తాయి..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!