Harirama Jogaiah: మంత్రి నిమ్మలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ
- మంత్రి నిమ్మల రామనాయుడికి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ
- పాలకొల్లులో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని అభ్యర్థన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harirama Jogaiah: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడుకి, ఎంపీ శ్రీనివాస్ వర్మకు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరి రామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. అభివృద్ధి అంటే రాజ్య సాధనాలు, పరిపాలన భవనాలు, నివాస భవనాలు, పార్కులు, కళాభవనాలు ,విశ్రాంతిభవనాలు, నిర్మించడానికి ప్రాధాన్యత కాదని.. రోడ్లు నిర్మాణం, సాగునీరు, మురుగు కాలువల నిర్మాణం, స్వచ్ఛమైన త్రాగునీరు విద్య, ఆరోగ్య పరిరక్షణతో పాటు వైద్య సౌకర్యం కల్పించడంలో అతి ముఖ్యమైనవని.. ఈ రకమైన చర్యలు చేపట్టడమే నిజమైన అభివృద్ధి అని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యత వేరుగా ఉందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: ఓ నేత పుట్టిన రోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు.. వీడియోలు వైరల్
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
నివాస పరిపాలన, రాజ్య భవనాల పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేయడానికి పూనుకోవడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ప్రాధాన్యతగా కనబడుతుందన్నారు. అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తూ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇది నిజమైన రాష్ట్ర అభివృద్ధి అనిపించుకోదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అదే ప్రభుత్వ లక్ష్యం కావాలి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, ఆచంట భీమవరం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజవర్గానికి సమాన దూరంలో ఉన్న పాలకొల్లు నియోజవర్గంలో ఆధునిక వైద్య సదుపాయాలు గల ఆస్పత్రిని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా చిన్నా పెద్దా వైద్య అవసరం వస్తే అటు హైదరాబాద్.. ఇటు విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం వస్తుందని.. అటువంటి అవస్థల నుండి బయటపడటానికి ప్రతి జిల్లాకి ఆరోగ్యశ్రీ కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పటల్ నిర్మించాల్సిన ప్రాధాన్యత ఎంతైనా ఉందన్నారు.
ఇప్పటికే పాలకొల్లు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి సాంక్షన్ కాబడి నిర్మాణ దశలో ఉందన్నారు. అలాగే మెడికల్ కాలేజీ సాంక్షన్ కాబడి నిర్మాణ దశలో ఉందన్నారు. అలాగే ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన 13 1/2 ఎకరాల స్థలం కూడా అందుబాటులో ఉందన్నారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకురావటంలో భాగంగా తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు మధ్యస్థమంగా ఉన్న పాలకొల్లు నియోజకవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ స్థాపించడం చాలా అవసరం ఉందన్నారు. దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మంత్రి నిమ్మల, ఎంపీ శ్రీనివాస్ వర్మను, ప్రజల తరుపున కోరుతున్నట్లు జోగయ్య తన లేఖ ద్వారా తెలియజేశారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?