పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు… ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమా తర్వాత లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి.. అందులో త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి.. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా సెట్ అయిన విషయం తెలిసిందే.
సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫమ్ అయ్యారు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి.. అయితే జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. అలాగే మృణాల్ ఠాకూర్, కీర్తి సురేష్ లలో ఒకరిని హీరోయిన్ గా తీసుకోవడం కోసం డైరెక్టర్ సంప్రదింపులు జరుపుతున్నారని టాక్.. వీరిద్దరిలో కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపిస్తుంది..
ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్ సిరీస్ తో పాటుగా, బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తుంది.. తెలుగులో కూడా ఓ సినిమా చేస్తుందని సమాచారం..