NTV Telugu Site icon

HanuMan : ‘హనుమాన్ ‘ కలెక్షన్స్ జాతర..15 రోజుల్లోనే ‘250’ కోట్లు..

Whatsapp Image 2024 01 27 At 12.29.47 Pm

Whatsapp Image 2024 01 27 At 12.29.47 Pm

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్ ‘. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది.హనుమాన్ మూవీలో హీరో తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇప్పటికీ 3 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులలోనే రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ వారంలో కొత్త తెలుగు సినిమాల రిలీజ్ లు కూడా లేకపోవడంతో హనుమాన్ మూవీ త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు..

హనుమాన్ మూవీకి కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలియజేసిన విషయం తెలిసిందే..ఇక ఇటీవల అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి హనుమాన్‌ మూవీ కు అపారమైన ప్రేమాభిమానాలు, మద్దతు లభించినందుకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా కొత్త ప్రయాణానికి నాంది పలుకుతున్నాను. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుంది” అని ప్రశాంత్ పేర్కొన్నారు.జై హనుమాన్ మూవీ 2025 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అలాగే సినిమాలో ఒక స్టార్ హీరో రాముడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హనుమాన్ మూవీ కంటే జై హనుమాన్ మూవీ మరింత విజువల్ వండర్ గా ఉండేట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు..