Site icon NTV Telugu

Gutha Sukhender Reddy : అధికారం కోసం దురాలోచన చేసే వారిని ప్రజలు గమనించాలి

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

నల్లగొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం దురాలోచన చేసే వారిని ప్రజలు గమనించాలని, తెలంగాణను వ్యతిరేకించి మళ్ళీ ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు కేవీపీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సమైక్య వాదుల కబంద హాస్తాల్లోకి తెలంగాణ పోవద్దని, హైదరాబాద్ లోనే ఉంటాం, తెలంగాణకు ద్రోహం, కుట్రలు చేస్తామంటే సహించరన్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. తెలంగాణపై దండయాత్రలా కేవీపీ, షర్మిల, రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఉన్నాయని, జమిలి ఎన్నికలు సాధ్యం కాదనేది అందరికీ తెలుసన్నారు.

Also Read : Rajinikanth: జైలర్ కాదు… ఇప్పుడు గవర్నర్ రజనీకాంత్‌‌..?

తెలంగాణలో సీమాంధ్ర నేతలు మరోసారి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 2014కు ముందు ఆంధ్రా వలస పాలకులు తెలంగాణ సహజ వనరులను దోచుకున్నారని, ఇప్పుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు నేతలు మళ్లీ తెలంగాణలో మకాం వేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు తాను తెలంగాణ స్థానికుడినని చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద ప్లాన్‌ ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ఆంధ్రా నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో రావులదే కీలకపాత్ర అని ఆయన ఎత్తిచూపారు. వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు వైఎస్‌ షర్మిలపై సెటైర్లు వేస్తూ.. రాజన్న రాజ్యం కంటే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలన 100 రెట్లు మెరుగ్గా ఉందని అన్నారు. రాష్ట్రంలో రైతులు, నేత కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు సమస్యల రహిత జీవితాన్ని గడుపుతున్నారని ఆమె గుర్తుంచుకోవాలి.

Also Read : Meenakshi Chaudhary: గురూజీ టేస్ట్ ఉంటుంది రా.. చారి.. వేరే లెవెల్ అంతే

Exit mobile version