Gujarat Crorepati Family: వందల కోట్ల ఆస్తులున్నా.. సంతోషం లేదని సన్యాసులుగా మారిన కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Crorepati Family: ఆస్తులు లేకపోయిన పూరిగుడిసెలో కూడా సంతోషంగా జీవించవచ్చు. ఎన్ని కోట్ల ఆస్తులున్న మనిషికి మనశ్శాంతి లేకపోతే వేస్ట్. అలాంటి ఓ వందల కోట్ల ఆస్తులున్న ఫ్యామిలీ వాటిన్నింటిని వదులుకుని సన్యాసుల్లో కలిసిపోయింది. గుజరాత్కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య సన్యాసి జీవితాన్ని గడపడానికి తమ కోట్లాది సంపదను, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. వారి బాటలోనే 12 సంవత్సరాల క్రితం అతని కుమారుడు, కుమార్తె కూడా ఇదే జీవితాన్ని దత్తత తీసుకున్నారు. విశేషమేమిటంటే, గుజరాత్కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి, అతని భార్య ప్రతి సంవత్సరం 15 కోట్ల రూపాయలు సంపాదించేవారు.
Read Also:India-China: భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై కొనసాగుతున్న చర్చలు
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
గుజరాత్లోని అత్యంత విజయవంతమైన వజ్రాల వ్యాపారులలో ఒకరైన దీపేష్ షా కోట్ల విలువైన సంపదను కలిగి ఉన్నాడు. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ఈ వ్యాపారవేత్త, అతని భార్య తమ వ్యాపారాన్ని ముగించి సన్యాసాన్ని స్వీకరించారు. దాని కోసం వారు తమ భారీ సంపదను వదులుకున్నారు. ఒక దశాబ్దం క్రితం దీపేష్ షా కుమారుడు భాగ్యరత్న, అతని కుమార్తె సాధువు జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అపారమైన సంపదను త్యజించారు. ఇప్పుడు అతని తల్లిదండ్రులు దీపేష్, పికా కూడా అలాంటి జీవితాన్ని ఎంచుకున్నారు. దీక్షా కార్యక్రమంలో షా కుమారుడు ఫెరారీని నడిపాడు. అతని తల్లిదండ్రులు జాగ్వార్లో ప్రయాణించారు.
Read Also:Minister Errabelli: మంత్రి సంతకం ఫోర్జరీ.. లెటర్ హెడ్తో బోగస్ సిఫార్స్ లేఖ
తమ భౌతిక ఆస్తులను, విలాసవంతమైన జీవనశైలిని విడిచిపెట్టి ఈ జంట ఇతర సన్యాసులతో కలిసి మైళ్ళ దూరం నడిచి సన్యాసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అలాంటి జీవితాన్ని గడపడానికి సన్నాహకంగా, దినేష్ షా ఇప్పటికే 350 కిలోమీటర్లు నడిచారు. అతని భార్య పికా మహిళా సన్యాసులతో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. దీపేష్ షా మాట్లాడుతూ.. ‘నా కుమార్తె దీక్ష చేపట్టినప్పుడు, మేము కూడా ఒక రోజు ఆమె బాటలో నడవాలని కోరుకున్నాము. నేను సంపద, జీవితంలో సాధించిన విజయాలను పొందాను. కానీ అంతిమ శాంతి, ఆనందం కోసం అన్వేషణ ఎప్పుడూ ముగియలేదు’. దీపేష్ తండ్రి ప్రవీణ్ బెల్లం, పంచదార వ్యాపారం చేసేవాడు. జైన సన్యాసులతో సన్నిహితంగా ఉండేందుకు సూరత్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!