Gujarat Crorepati Family: వందల కోట్ల ఆస్తులున్నా.. సంతోషం లేదని సన్యాసులుగా మారిన కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Crorepati Family: ఆస్తులు లేకపోయిన పూరిగుడిసెలో కూడా సంతోషంగా జీవించవచ్చు. ఎన్ని కోట్ల ఆస్తులున్న మనిషికి మనశ్శాంతి లేకపోతే వేస్ట్. అలాంటి ఓ వందల కోట్ల ఆస్తులున్న ఫ్యామిలీ వాటిన్నింటిని వదులుకుని సన్యాసుల్లో కలిసిపోయింది. గుజరాత్కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య సన్యాసి జీవితాన్ని గడపడానికి తమ కోట్లాది సంపదను, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. వారి బాటలోనే 12 సంవత్సరాల క్రితం అతని కుమారుడు, కుమార్తె కూడా ఇదే జీవితాన్ని దత్తత తీసుకున్నారు. విశేషమేమిటంటే, గుజరాత్కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి, అతని భార్య ప్రతి సంవత్సరం 15 కోట్ల రూపాయలు సంపాదించేవారు.
Read Also:India-China: భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై కొనసాగుతున్న చర్చలు
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
గుజరాత్లోని అత్యంత విజయవంతమైన వజ్రాల వ్యాపారులలో ఒకరైన దీపేష్ షా కోట్ల విలువైన సంపదను కలిగి ఉన్నాడు. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ఈ వ్యాపారవేత్త, అతని భార్య తమ వ్యాపారాన్ని ముగించి సన్యాసాన్ని స్వీకరించారు. దాని కోసం వారు తమ భారీ సంపదను వదులుకున్నారు. ఒక దశాబ్దం క్రితం దీపేష్ షా కుమారుడు భాగ్యరత్న, అతని కుమార్తె సాధువు జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అపారమైన సంపదను త్యజించారు. ఇప్పుడు అతని తల్లిదండ్రులు దీపేష్, పికా కూడా అలాంటి జీవితాన్ని ఎంచుకున్నారు. దీక్షా కార్యక్రమంలో షా కుమారుడు ఫెరారీని నడిపాడు. అతని తల్లిదండ్రులు జాగ్వార్లో ప్రయాణించారు.
Read Also:Minister Errabelli: మంత్రి సంతకం ఫోర్జరీ.. లెటర్ హెడ్తో బోగస్ సిఫార్స్ లేఖ
తమ భౌతిక ఆస్తులను, విలాసవంతమైన జీవనశైలిని విడిచిపెట్టి ఈ జంట ఇతర సన్యాసులతో కలిసి మైళ్ళ దూరం నడిచి సన్యాసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అలాంటి జీవితాన్ని గడపడానికి సన్నాహకంగా, దినేష్ షా ఇప్పటికే 350 కిలోమీటర్లు నడిచారు. అతని భార్య పికా మహిళా సన్యాసులతో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. దీపేష్ షా మాట్లాడుతూ.. ‘నా కుమార్తె దీక్ష చేపట్టినప్పుడు, మేము కూడా ఒక రోజు ఆమె బాటలో నడవాలని కోరుకున్నాము. నేను సంపద, జీవితంలో సాధించిన విజయాలను పొందాను. కానీ అంతిమ శాంతి, ఆనందం కోసం అన్వేషణ ఎప్పుడూ ముగియలేదు’. దీపేష్ తండ్రి ప్రవీణ్ బెల్లం, పంచదార వ్యాపారం చేసేవాడు. జైన సన్యాసులతో సన్నిహితంగా ఉండేందుకు సూరత్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?