Illegal registration : రైతుబంధు ఇప్పిస్తానని చెప్పి.. నానమ్మ భూమి కాజేసిన మనవడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు బంధు పేరుతో సొంత నానమ్మ భూమినే కాజేశాడు ఓ మనువడు. మాయమాటలు చెప్పి వృద్ధురాలిని మోసం చేసి ఎకరం భూమిని తన పేరుమీదకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
Also Read : Bhatti Vikramarka : ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం: భట్టి విక్రమార్క
Also Read
- Sheikh Hasina: "నరహంతకురాలు".. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
జగిత్యాల జిల్లా కొడిమ్మాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నీలగిరి అమ్మాయి అనే వృద్ధురాలుకి రెండు ఎకరాల భూమి ఉంది. అయితే గతంలో ఒక ఎకరం భూమిని వృద్ధురాలు తన కొడుకు పేరు మీద పట్టా చేసింది. తన పేరుమీద ఓ ఎకరం భూమిని రిజిస్టేషన్ చేయించుకుంది. అయితే నానమ్మ భూమిపై మనుమడు రామేశ్వర్ కన్నేశాడు.
Also Read : Viral Video: ఫుల్గా మందేశాడు.. ఎద్దును ఎక్కి స్వారీ చేశాడు..
ఐదు నెలల కింద రైతుబంధు డబ్బులు ఇప్పిస్తానని నానమ్మకు రామేశ్వర్ అబద్దాలు చెప్పాడు. అది నమ్మిన నీలగిరి అమ్మాయి మనుమడితో ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లింది. దీంతో ఆమె పేరుపై ఉన్న ఎకరం ల్యాండ్ ని అక్రమంగా తన పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మనవడు చెప్పిన చోటల్లా వృద్ధురాలు సంతకం పెట్టింది. దీంతో ఆమె పేరు మీద ఉన్న భూమి రామేశ్వర్ పేరు మీద రిజిస్ట్రర్ అయింది.
Also Read : Cyclone Mocha: దిశ మార్చుకున్న “మోచా తుఫాను”.. బంగ్లాదేశ్-మయన్మార్ వైపు కదలిక
అయితే చాలా రోజుల కావడంతో మనవడు ఇప్పిస్తానన్న రైతుబంధు డబ్బులు రాకపోవడంతో వృద్ధురాలు.. ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లి ఆరా తీసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. తన భూమిని మనవడే లాగేసుకున్నాడని ఆర్డీవో దగ్గరకు వెళ్లి మోరపెట్టుకోవడంతో.. భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని గ్రహించిన ఆర్డీవో.. కొడిమ్యాల తహసీల్దార్ కు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. నీలగిరి అమ్మాయి పేరు తరపున ఉన్న భూమి రిజిస్ట్రేషన్ ను హోల్డ్ లో పెట్టమని ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలు ఫిర్యాదుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన రామేశ్వర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!