Chain Snatchers : చూపులన్నీ టార్గెట్ వైపే.. దొంగలను పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగతనాలు చేసేందుకు అలవాటు పడిన వ్యక్తులు ఎంతకైనా తెగిస్తారు.. కొట్టేయాలని వన్స్ ఫిక్సైతే చాలు.. వారి చూపులన్నీ టార్గెట్ దగ్గర ఉన్న వస్తువు మీదు ఉంటుంది. ఈ క్రమంలో వస్తువు ఓనర్ ను సైతం కొన్నిసార్లు పట్టించుకోరు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దొంగ అచ్చం ఇట్లాగే చేశాడు. తాను దొంగతనం చేసేందుకు ఇంట్లో వ్యక్తినే టార్గెట్ చేసుకున్నాడు. చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు.
Also Read : Man Chops Woman Body: మహిళను చంపి ముక్కలు ముక్కలుగా పాతేశాడు..
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన ఓ వృద్దురాలి మెడలో నుంచి హోలీ పండగ రోజు గుర్తు తెలియని వ్యక్తులు 3 తులాల పుస్తెల తాడు తెంపుకుపోయారు. మరుసటి రోజు ఆమె స్థానిక పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు కోణాల్లో విచారణ చేసిన పోలీసులు చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.. దీంతో రూట్ మార్చారు. ఈ క్రమంలో మల్కపేట గ్రామానికి చెందిన వృద్దురాలి మనవడు ఎక్కలదేవి కరుణాకర్, అతడి స్నేహితుడుకి గతంలో దొంగతనాలు చేసిన చరిత్ర ఉందని తెలుసుకున్నారు. వారిపై అనుమానంతో సాంకేతికతను ఉపయోగించారు.
Also Read : Komatireddy Venkat Reddy: భట్టి పాదయాత్రకు మీరు రండి.. నేను వస్తా..!
దీంతో ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను, సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా వృద్దురాలి మనవడే.. తన స్నేహితుడితో కలిసి ఈ దొంగతనం చేశాడని పోలీసులు నిర్థారించుకున్నారు. నిందితులను పట్టుకుని బంగారం, ఓ బైక్, ఇద్దరి సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో భాగంగా నిందితులిద్దరు నేరాన్ని అంగీకరిండంతో రిమాండ్ కు తరలించినట్లు చందుర్తి సీఐ కిరణ్ తెలిపారు. ఈ కేసును పోలీసులు రెండు రోజుల్లో పరిష్కరించినందుకు సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఇంటి దొంగను పట్టించి.. తన సొమ్మును రికవరీ చేసి ఇచ్చిన పోలీసులకు వృద్దురాలు కృతజ్ఞతలు తెలిపింది.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!