Chain Snatchers : చూపులన్నీ టార్గెట్ వైపే.. దొంగలను పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగతనాలు చేసేందుకు అలవాటు పడిన వ్యక్తులు ఎంతకైనా తెగిస్తారు.. కొట్టేయాలని వన్స్ ఫిక్సైతే చాలు.. వారి చూపులన్నీ టార్గెట్ దగ్గర ఉన్న వస్తువు మీదు ఉంటుంది. ఈ క్రమంలో వస్తువు ఓనర్ ను సైతం కొన్నిసార్లు పట్టించుకోరు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దొంగ అచ్చం ఇట్లాగే చేశాడు. తాను దొంగతనం చేసేందుకు ఇంట్లో వ్యక్తినే టార్గెట్ చేసుకున్నాడు. చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు.
Also Read : Man Chops Woman Body: మహిళను చంపి ముక్కలు ముక్కలుగా పాతేశాడు..
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన ఓ వృద్దురాలి మెడలో నుంచి హోలీ పండగ రోజు గుర్తు తెలియని వ్యక్తులు 3 తులాల పుస్తెల తాడు తెంపుకుపోయారు. మరుసటి రోజు ఆమె స్థానిక పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు కోణాల్లో విచారణ చేసిన పోలీసులు చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు.. దీంతో రూట్ మార్చారు. ఈ క్రమంలో మల్కపేట గ్రామానికి చెందిన వృద్దురాలి మనవడు ఎక్కలదేవి కరుణాకర్, అతడి స్నేహితుడుకి గతంలో దొంగతనాలు చేసిన చరిత్ర ఉందని తెలుసుకున్నారు. వారిపై అనుమానంతో సాంకేతికతను ఉపయోగించారు.
Also Read : Komatireddy Venkat Reddy: భట్టి పాదయాత్రకు మీరు రండి.. నేను వస్తా..!
దీంతో ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను, సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా వృద్దురాలి మనవడే.. తన స్నేహితుడితో కలిసి ఈ దొంగతనం చేశాడని పోలీసులు నిర్థారించుకున్నారు. నిందితులను పట్టుకుని బంగారం, ఓ బైక్, ఇద్దరి సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో భాగంగా నిందితులిద్దరు నేరాన్ని అంగీకరిండంతో రిమాండ్ కు తరలించినట్లు చందుర్తి సీఐ కిరణ్ తెలిపారు. ఈ కేసును పోలీసులు రెండు రోజుల్లో పరిష్కరించినందుకు సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఇంటి దొంగను పట్టించి.. తన సొమ్మును రికవరీ చేసి ఇచ్చిన పోలీసులకు వృద్దురాలు కృతజ్ఞతలు తెలిపింది.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!