Governor Tamilisai: ఢిల్లీకి తమిళి సై.. అమిత్ షాతో భేటీ
Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై నేడు ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ తమిళి సై హోంమంత్రి అమిత్ షాకు వివరించనున్నారని తెలిసింది. ఈ నెల 12న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపై కూడా తమిళి సై చర్చించనున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలపై… ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ సంఘటనపై ముగ్గురు అరెస్టయ్యారు. ఢిల్లీ పెద్దల పేర్లు కూడా ఇందులో వినిపించాయి. ప్రధానంగా దీనిపై ఇరువురి మధ్య చర్చ జరగనున్నట్లు వినవస్తోంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా ఆమె అమిత్ షాకు తెలియజేయనున్నారని విశ్వసనీయ సమాచారం. కాగా, గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Twitter : ట్విటర్ తీసేసింది.. ఇప్పుడు మెటా మొదలు పెట్టింది
Also Read
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?