Bangalore: శాస్త్రవేత్తను కత్తులతో వెంబడించిన గుండాలు.. కారు అద్దం పగులగొట్టి ఆపై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangalore: ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరులో ఈ మధ్య క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది. రోడ్డుపైనే దుండగులు రెచ్చిపోయి దాడి చేస్తున్నారు. ఇలాంటి కేసులు కొన్ని నెలల నుంచి వరుసగా జరుగుతున్నాయి. తాజాగా ఓ సైంటిస్ట్ ను కొంత మంది లోకల్ గూండాలు కత్తులతో వెంబడించారు. ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాలను ఆ శాస్త్రవేత్త ఎక్స్(ట్విటర్) వేదికగా పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది. ఇక విషయంలో వెంటనే స్పందించనందుకు ఆయన పోలీసులపై కూడా ఫైర్ అయ్యారు.
అసలేం జరిగిందంటే.. ఆగస్టు 24వ తేదీన మధ్యాహ్నం 12:45గంటలకు కారులో వెళుతుండగా రౌతనహళ్లి రోడ్డు వద్ద కొంత మంది రౌడీలు అశుతోష్ సింగ్ అనే సైంటిస్ట్ కారును ఆపడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కత్తులతో వారు ఆయన వెంటపడ్డారు. దాడిలో ఆయన కారు అద్దాన్ని వారు ధ్వంసం చేశారు. ఎలాగొలా వారి బారి నుంచి తప్పించుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఇంతవరకు సరిగా స్పందించకపోవడంతో ఆయన ఎక్స్(ట్విటర్) ద్వారా జరిగిన విషయంతో పాటు పగలగొట్టిన తన కారు ఫోటోలను షేరు చేశారు. దీంతో ఈ ఘటనపై కర్ణాటక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్( ట్రాఫిక్ అండ్ సేఫ్టీ) అలోక్ కుమార్ స్పందించారు.
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
Also Read: Kaveri water: కర్ణాటకకు షాక్ .. తమిళనాడుకు రోజూ 5వేల క్యూసెక్కులు
వెంటనే వారిని పట్టుకొని వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కేసుపై దర్యాప్తు చేయాలని తానే స్వయంగా అధికారులను ఆదేశిస్తానని, దగ్గరుండి కేసును పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసకుంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 112 నంబర్ కు కాల్ చేయాలని, పోలీసులు వెంటనే స్పందిస్తారని ఆయన పేర్కొ్న్నారు. ఇక సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో ఈ మధ్య నేరాలు నిజంగానే పెరిగిపోయాయంటూ అశుతోష్ సింగ్ ట్వీట్ కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోలీసు శాఖ ఇటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే నగరంలో రౌడీయిజం పెట్రేగి పోయే అవకాశాలు ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అయితే ఆ సైంటిస్ట్ ను కత్తులతో వెంబడించడానికి గల కారణం మాత్రం తెలియలేదు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!