PM Kisan Scheme: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. చనిపోయినా డబ్బులొస్తాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Scheme: బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో వచ్చిందే పీఎం కిసాన్ యోజన. ఈ స్కీమ్ ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకోవచ్చు. ఏడాదిలో రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటి వరకు రైతులకు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత రానుంది. అయితే ఇప్పటి వరకు ఏ తేదీన రైతు ఖాతాల్లో జమ చేస్తారనే విషయం ఇంకా కేంద్రం అధికారికంగా వెల్లడించకపోయినా.. ఈ వారంలో ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు తెలియని అనేక నియమాలు ఉన్నాయి. వాస్తవానికి, రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, వెంటనే దాన్ని పరిష్కరించుకోండి.
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Dhavaleshwaram project: ధవళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు
ఇందుకు మీరు హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. పీఎంకిసాన్కు చెందిన హెల్ప్లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092లో సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును ఇ-మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయవచ్చు. మీరు ఇంకా దరఖాస్తు చేసుకోనట్లయితే, అధికారిక వెబ్సైట్ ని సందర్శించడం ద్వారా సదరు రైతు పేరును నమోదు చేయడం ద్వారా పీఎం కిసాన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.అయితే ఈ పథకం లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణించినా, ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు.లబ్ధిదారుడు మరణిస్తే సాగు భూమిని కలిగి ఉన్న రైతు వారసులు ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. అయితే దీని కోసం కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా రూపొందించబడ్డాయి. ఆ రైతు వారసుడు పీఎం కిసాన్ పోర్టల్లో ప్రత్యేకంగా నమోదు చేసుకోవాలి. అంతే కాదు.. ఈ వారసుడు ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలనే షరతులను నెరవేరుస్తున్నాడా లేదా అనేది కూడా చూస్తారు. రైతు వారసుడు ఈ పథకం కింద రూపొందించిన నిబంధనలను నెరవేర్చినట్లయితే, అతను ఈ పథకం ప్రయోజనం పొందుతాడు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!