Gold Price Today: ఇది కదా కావాల్సింది.. నేడు కూడా భారీ తగ్గింపు!
- దిగొస్తున్న బంగారం ధరలు
- 24 క్యారెట్ బంగారంపై 600తగ్గుదల
- భారీగా తగ్గిన వెండి ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Drop in Gold and Silver Rates in Hyderabad: కొన్ని రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత 10-12 రోజుల నుంచి గోల్డ్ రేట్స్ క్రమంగా దిగొస్తున్నాయి. శ్రావణ మాసం ప్రారంభంలో ఆల్టైమ్ హైకి చేరుకున్న బంగారం.. ఇప్పుడు దిగిరావడం పసిడి ప్రేమికులకు ఊరటనిస్తోంది. ఈ రోజు (ఆగష్టు 20) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి.. రూ.1,00,750 నుంచి రూ.1,00,150గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం 550 రూపాయలు తగ్గి.. రూ.92,350 నుంచి రూ.91,800గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఈరోజు బంగారం ధరలే కాదు.. వెండి ధర కూడా భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.1000 తగ్గి.. రూ.1,16,000 నుంచి రూ.1,15,000కి చేరింది. హైదరాబాద్ మార్కెట్లో నేడు కిలో వెండి లక్ష 25 వేలుగా నమోదైంది. తులం వెండి రూ.1,250కి లభిస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్సైట్లో నమోదైన గోల్డ్, సిల్వర్ ధరలు ఇవి. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
Also Read
Also Read: Asia Cup 2025: బెంచ్లో ‘ఆ నలుగురు’.. భారత తుది జట్టు ఇదేనా?
12 రోజుల క్రితంతో పోల్చితే.. ఇప్పుడు తులం బంగారంపై రూ.3000కు పైగా తగ్గింది. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం అనే చెప్పాలి. భారత్లో గోల్డ్ రేట్స్ తగ్గడానికి లేదా పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, టాక్స్, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు.. లాంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలలో మార్పు ఉంటుంది.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..