Site icon NTV Telugu

Gold and Silver Prices : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు చెప్పిన ఆర్థిక మంత్రి..

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Gold and Silver Prices : దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో వెండి ధర ఏకంగా కిలోకు రూ.15,000 పైగా పెరగగా, బంగారం ధర 10 గ్రాములకు రూ.3,000 పైగా ఎగబాకింది. ఈ అసాధారణ పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పెట్టుబడిదారులకు మరియు వినియోగదారులకు కీలక విషయాలు వెల్లడించారు..

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
ఆర్బీఐ (RBI) బోర్డు సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ఉన్న అంతర్జాతీయ పరిణామాలను వివరించారు.. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.. గతంలో కేవలం భారత్, చైనా డిమాండ్ వల్లే ధరలు పెరిగేవి. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ఇదే ప్రస్తుత పెరుగుదలకు ప్రధాన కారణం అని వెల్లడించారు.

ప్రపంచ అనిశ్చితి: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న కొత్త సుంకాల (Tariffs) హెచ్చరికల వల్ల స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని మరో మాటకగా పేర్కొన్నారు ఆర్థిక మంత్రి..

దిగుమతులపై ఆధారపడటం: భారత్ తన బంగారం అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.. దేశీయంగా తగినంత వెలికితీత వనరులు లేకపోవడం కూడా ధరలపై ప్రభావం చూపుతోందని వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌..

తాజా ధరల వివారల్లోకి వెళ్తే.. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,724 పెరిగి.. రూ.1,60,600కి చేరింఇ.. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.15,931 పెరిగి రూ.2,68,875కు ఎగబాకింది.. అయితే, బంగారం, వెండి ధరల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆర్బీఐ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. కొనుగోళ్లు ఇంకా పరిమితి దాటలేదు” అని పేర్కొన్నారు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌..

Exit mobile version