Gold and Silver Prices : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు చెప్పిన ఆర్థిక మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices : దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్లో వెండి ధర ఏకంగా కిలోకు రూ.15,000 పైగా పెరగగా, బంగారం ధర 10 గ్రాములకు రూ.3,000 పైగా ఎగబాకింది. ఈ అసాధారణ పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పెట్టుబడిదారులకు మరియు వినియోగదారులకు కీలక విషయాలు వెల్లడించారు..
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
ఆర్బీఐ (RBI) బోర్డు సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ఉన్న అంతర్జాతీయ పరిణామాలను వివరించారు.. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.. గతంలో కేవలం భారత్, చైనా డిమాండ్ వల్లే ధరలు పెరిగేవి. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ఇదే ప్రస్తుత పెరుగుదలకు ప్రధాన కారణం అని వెల్లడించారు.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ప్రపంచ అనిశ్చితి: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న కొత్త సుంకాల (Tariffs) హెచ్చరికల వల్ల స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని మరో మాటకగా పేర్కొన్నారు ఆర్థిక మంత్రి..
దిగుమతులపై ఆధారపడటం: భారత్ తన బంగారం అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.. దేశీయంగా తగినంత వెలికితీత వనరులు లేకపోవడం కూడా ధరలపై ప్రభావం చూపుతోందని వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
తాజా ధరల వివారల్లోకి వెళ్తే.. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,724 పెరిగి.. రూ.1,60,600కి చేరింఇ.. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.15,931 పెరిగి రూ.2,68,875కు ఎగబాకింది.. అయితే, బంగారం, వెండి ధరల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆర్బీఐ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. కొనుగోళ్లు ఇంకా పరిమితి దాటలేదు” అని పేర్కొన్నారు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!