GHMC : ఆస్తిపన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం..
- జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
- 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం
- ఇప్పటివరకు దాదాపు రూ.1416 కోట్ల మేరకు మాత్రమే వసూలు
- ఇంకా 5 లక్షల మంది భవన యజమానులు బకాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC : హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఇప్పటివరకు దాదాపు రూ.1416 కోట్ల మేరకు మాత్రమే వసూలైంది. ఇప్పటివరకు 12 లక్షల మంది తమ ఆస్తిపన్ను చెల్లించగా, ఇంకా 5 లక్షల మంది భవన యజమానులు బకాయి కట్టాల్సి ఉంది. వీరి నుంచి సుమారు రూ.684 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది.
మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, వసూళ్ల పెంపు లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బకాయిదారులకు వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీమ్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ పథకం కింద 90% వడ్డీ రాయితీ కల్పించాలని జీహెచ్ఎంసీ ప్రభుత్వం అనుమతి కోరనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కమిషనర్ ఇలంబర్తి పరిశీలనలో ఉంది.
Tamilnadu : కదులుతున్న రైలులో గర్భిణీ స్త్రీపై అత్యాచారం.. తర్వాత బయటకు తోసేశారు
Also Read
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5000 కోట్ల వరకు ఆస్తిపన్ను బకాయిలు ఉన్నట్లు అంచనా. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలే రూ.3000 కోట్లు ఉంటే, మిగతా రూ.2000 కోట్లను సాధారణ ఆస్తిపన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఓటీఎస్ పథకాన్ని అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నెలాఖరులోగా ఓటీఎస్ పథకానికి అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఓటీఎస్ అమలు అయినట్లయితే, బకాయిదారులు కేవలం 10% వడ్డీ మాత్రమే చెల్లించి తక్కువ ఖర్చుతో తమ ఆస్తిపన్ను రుసుమును పూర్తిగా తీర్చుకునే అవకాశాన్ని పొందనున్నారు.
జీహెచ్ఎంసీ గతంలో ఇప్పటికే మూడు సార్లు వన్టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని అమలు చేసింది. మొదటి విడత – 2020 ఆగస్టు 1 నుంచి నవంబరు 15 వరకు. రెండో విడత – 2022 జులై నెలలో. మూడో విడత – మునుపటి రెండు కార్యక్రమాలను కలిపి దాదాపు రూ.700 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఓటీఎస్ను అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది బకాయిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
ఈ పథకానికి ప్రభుత్వ అనుమతి లభిస్తే, ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు తక్కువ వడ్డీతో బకాయిలను క్లియర్ చేసుకునే వీలుంటుంది. ఇది ఒక వైపు ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా, జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయాన్ని అందించనుంది.
VC Sajjanar : క్షేత్ర స్థాయి ఉద్యోగులు, అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వర్చువల్ సమావేశాలు
తాజావార్తలు
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!