GHMC : ఆస్తిపన్ను బకాయిలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం..
- జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
- 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం
- ఇప్పటివరకు దాదాపు రూ.1416 కోట్ల మేరకు మాత్రమే వసూలు
- ఇంకా 5 లక్షల మంది భవన యజమానులు బకాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC : హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2100 కోట్ల ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఇప్పటివరకు దాదాపు రూ.1416 కోట్ల మేరకు మాత్రమే వసూలైంది. ఇప్పటివరకు 12 లక్షల మంది తమ ఆస్తిపన్ను చెల్లించగా, ఇంకా 5 లక్షల మంది భవన యజమానులు బకాయి కట్టాల్సి ఉంది. వీరి నుంచి సుమారు రూ.684 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది.
మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, వసూళ్ల పెంపు లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బకాయిదారులకు వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీమ్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ పథకం కింద 90% వడ్డీ రాయితీ కల్పించాలని జీహెచ్ఎంసీ ప్రభుత్వం అనుమతి కోరనుంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కమిషనర్ ఇలంబర్తి పరిశీలనలో ఉంది.
Tamilnadu : కదులుతున్న రైలులో గర్భిణీ స్త్రీపై అత్యాచారం.. తర్వాత బయటకు తోసేశారు
Also Read
- కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
- TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
- గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5000 కోట్ల వరకు ఆస్తిపన్ను బకాయిలు ఉన్నట్లు అంచనా. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలే రూ.3000 కోట్లు ఉంటే, మిగతా రూ.2000 కోట్లను సాధారణ ఆస్తిపన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఓటీఎస్ పథకాన్ని అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నెలాఖరులోగా ఓటీఎస్ పథకానికి అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఓటీఎస్ అమలు అయినట్లయితే, బకాయిదారులు కేవలం 10% వడ్డీ మాత్రమే చెల్లించి తక్కువ ఖర్చుతో తమ ఆస్తిపన్ను రుసుమును పూర్తిగా తీర్చుకునే అవకాశాన్ని పొందనున్నారు.
జీహెచ్ఎంసీ గతంలో ఇప్పటికే మూడు సార్లు వన్టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని అమలు చేసింది. మొదటి విడత – 2020 ఆగస్టు 1 నుంచి నవంబరు 15 వరకు. రెండో విడత – 2022 జులై నెలలో. మూడో విడత – మునుపటి రెండు కార్యక్రమాలను కలిపి దాదాపు రూ.700 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఓటీఎస్ను అమలు చేస్తే కనీసం రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 2 లక్షల మంది బకాయిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
ఈ పథకానికి ప్రభుత్వ అనుమతి లభిస్తే, ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు తక్కువ వడ్డీతో బకాయిలను క్లియర్ చేసుకునే వీలుంటుంది. ఇది ఒక వైపు ప్రజలకు ఉపశమనం కలిగించడమే కాకుండా, జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయాన్ని అందించనుంది.
VC Sajjanar : క్షేత్ర స్థాయి ఉద్యోగులు, అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వర్చువల్ సమావేశాలు
తాజావార్తలు
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
-
Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
-
Vivo Y31T 5G: 7200mAh బ్యాటరీతో Vivo Y31T 5G.. 120Hz స్క్రీన్, 50MP కెమెరా.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే
-
ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!