Uttarpradesh : ప్రియుడి ఎంగేజ్ మెంట్ వేడుకలోనే విషం తాగి ప్రియురాలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని ఒక గ్రామంలో ఓ హై వోల్టేజ్ డ్రామా కనిపించింది. ఇక్కడ ఓ యువకుడి నిశ్చితార్థ వేడుక జరుగుతోంది. దీంతో అతని ప్రియురాలు అక్కడికి వచ్చి బెదిరించింది. కార్యక్రమంలో రచ్చ రచ్చ చేసింది. ఆపై తన ప్రేమికుడు.. ఇతర అతిథుల ముందు విషం తాగింది. పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చడానికి బదులుగా, యువకుడి కుటుంబం ఆమెను తన ఇంటి వద్ద దింపినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితి విషమించడంతో అతని తల్లి మోదీనగర్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మీరట్కు రెఫర్ చేశారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.
ఈ ఘటన ముస్సోరీ ప్రాంతానికి చెందినది. సమాచారం మేరకు ఇక్కడ నివాసముంటున్న ఓ బీఎస్సీ విద్యార్థిని సమీపంలోని ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. వీరిద్దరూ గ్రామంలోని ఓ ఇంటర్ కాలేజీలో చదువుకున్నారు. అప్పటి నుంచే ఇద్దరికీ పరిచయం. విద్యార్థిని తన తల్లితో కలిసి గ్రామంలోని తన మేనమామ వద్ద నివసించింది. వాస్తవానికి ఆమె హర్యానాలోని సిర్సా నివాసి. అదే సమయంలో యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
Also Read
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
Read Also:Beijing: మరో యుద్ధ నౌకను సిద్ధం చేసిన డ్రాగెన్.. భారత్ కు ప్రమాదం పొంచి ఉందా..?
గురువారం ప్రేమికుడికి నిశ్చితార్థం జరుగుతోందని తెలుసుకున్న యువతి అతడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి హంగామా సృష్టించింది. యువకుడు ఆమెకు చాలా చెప్పి చూసినా ఆమె అంగీకరించకపోవడంతో విషం తాగింది. దీంతో కుటుంబ సభ్యులు యువతిని హడావుడిగా ఇంటి వద్ద దింపారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏసీపీ ముస్సోరి నరేష్ కుమార్ తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.
అంతకుముందు, బందా జిల్లాలోని మార్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో గర్భిణీ తన ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ పొలంలో చెట్టుకు 19 ఏళ్ల యువతి తన దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఇన్స్పెక్టర్ (ఎస్హెచ్ఓ) మార్క పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ ప్రజాపతి తెలిపారు. గత ఐదేళ్లుగా ఓ యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు మహిళ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంతలో ఆమె గర్భవతి అయింది. తను గర్భవతి అని తెలియడంతో పెళ్లికి కుర్రాడి కుటుంబీకులను ఒప్పించే ప్రయత్నం చేయగా వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి తన ప్రేమికుడి పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Read Also:Maharashtra: మద్యం మత్తులో పోలీసులపై దాడి చేసిన ముగ్గురు మహిళలు..
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!