Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ghaziabad Girls Suicide Online Game Investigation

UP: “సారీ నాన్న”.. కొరియన్ గేమ్‌కు బలైన ముగ్గురు కూతుళ్లు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

Published Date :February 4, 2026 , 12:22 pm
By RAMAKRISHNA KENCHE
UP: “సారీ నాన్న”.. కొరియన్ గేమ్‌కు బలైన ముగ్గురు కూతుళ్లు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

UP: “సారీ నాన్న” ఇదేదో మామూలుగా చెప్పిన సారీ కాదు.. ముగ్గురు బిడ్డలు తమ ప్రాణాలను తామే బలవంతంగా తీసుకుని తండ్రికి చెప్పిన చివరి సారీ ఇది. ముగ్గురు కుమార్తెను సూసైడ్ చేసుకునే ముందు రాసిన లెటర్‌లోని వ్యాఖ్య ఇది. నిర్జీవంగా పడి ఉన్న ముగ్గురు కూతుళ్లను, వాళ్లు చివరి సారీగా రాసిన లెటర్‌ను చదివిన ఆ తండ్రి ఎంత ఆవేదనకు గురయ్యారో మీ ఊహకే వదిలేస్తున్నా.. అసలు ఏం జరిగిందంటే..

READ MORE: Ricky Ponting: వరల్డ్‌కప్‌లో భారత్ ఆశలు అతడిపైనే.. అభిషేక్పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ళు అపార్ట్‌మెంట్ తొమ్మిదో అంతస్తు నుంచి దూకిన ప్రాణాలు వదిలారు. మృతుల వయస్సులు 12, 14, 16 సంవత్సరాలు. స్థానికులు భారీ శబ్దం విని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని సీల్ చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సమయానికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటనకు కారణ ఒక కొరియన్ టాస్క్-బేస్డ్ ఆన్‌లైన్ గేమ్‌. ఆ గేమ్‌కు ఈ ముగ్గరు అమ్మాయిలు బానిసలయ్యారని పోలీసులు భావిస్తున్నారు. బాలికల తండ్రి చెతన్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ గేమ్‌లో మొత్తం 50 టాస్కులు ఉండగా సోమవారం చివరి టాస్క్ పూర్తయిందట. ఈ టాస్క్ పూర్తవ్వగానే ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డట్టు చెబుతున్నారు. “మా పిల్లలు ఇలాంటి టాస్క్ గేమ్ ఆడుతున్నారని నాకు అస్సలు తెలియదు. లూడో లాంటి గేమ్ ఆడుతున్నారు అనుకున్నాను. చనిపోవాలని చెప్పే గేమ్ ఉంటుందని ఊహించలేదు. ఫోరెన్సిక్ నిపుణులే ఈ విషయం చెప్పారు. వారు ఉపయోగించిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు,” అని కన్నీళ్లతో బాలికల తండ్రి చెతన్ కుమార్ వెల్లడించారు.

READ MORE: Ricky Ponting: వరల్డ్‌కప్‌లో భారత్ ఆశలు అతడిపైనే.. అభిషేక్పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

అయితే.. ఈ ముగ్గురిలోని ఓ బాలికల గదిలో ఒక పేజీ సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో “ఇది నిజ జీవిత కథ. ఈ డైరీలో ఉన్నది అంతా చదవండి.. ఎందుకంటే ఇవన్నీ నిజమే. రీడ్ నౌ! ఐ యామ్ రియల్లీ సారీ.. సారీ నాన్న” అని రాసి ఉంది. ఆ నోట్‌లో కన్నీటి ఎమోజీ కూడా డ్రాయింగ్ చేశారు. పోలీసులు ఆ నోట్‌ను ఆధారంగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే గదిలో కుటుంబ సభ్యుల ఫొటోలు నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు ఆన్‌లైన్ గేమింగ్ కారణమా అనే విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. “ముగ్గురు బాలికలు తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి దూకారని సమాచారం అందింది. వెంటనే మేము అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అసలు కారణం ఏమిటో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది,” అని ఎస్పీ అతుల్ కుమార్ సింగ్ తెలిపారు. డీసీపీ నిమిష్ పాటిల్ మాట్లాడుతూ.. బాలికలపై కొరియన్ గేమ్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆ గేమ్‌లో 14 ఏళ్ల బాలిక లీడర్‌గా ఉండి ఆదేశాలు నిర్ణయించిందని అనుమానం. గేమ్‌లో భాగంగా బాల్కనీ నుంచి దూకేందుకు రెండు మెట్ల చిన్న లాడర్ వాడినట్టు అనుమానిస్తున్నారు. ఈ గేమ్‌ను ఎవరు పరిచయం చేశారు? ఎలా మొదలైంది? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ఆన్‌లైన్ గేమింగ్, పిల్లల మానసిక ఆరోగ్యం, తల్లిదండ్రుల అప్రమత్తతపై తీవ్రమైన చర్చకు దారి తీసింది. పిల్లల డిజిటల్ ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, వారి ప్రవర్తనలో చిన్న మార్పులకైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Up

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Children Mental Health India
  • Ghaziabad Suicide Case
  • Korean Online Game Probe
  • Minor Girls Death Ghaziabad
  • Online Game Suicide India

తాజావార్తలు

  • Moinabad Farmhouse Drugs Case: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్..

  • Suyodhana Teaser: సస్పెన్స్ మిస్టరీతో ‘సుయోధన’ టీజర్

  • Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..

  • Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!

  • Election Commission: మోగిన ఎన్నికల నగారా.. 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల తేదీలు ప్రకటన..

ట్రెండింగ్‌

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
advertisement will close in 5 seconds ×
ads