UP: “సారీ నాన్న”.. కొరియన్ గేమ్కు బలైన ముగ్గురు కూతుళ్లు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: “సారీ నాన్న” ఇదేదో మామూలుగా చెప్పిన సారీ కాదు.. ముగ్గురు బిడ్డలు తమ ప్రాణాలను తామే బలవంతంగా తీసుకుని తండ్రికి చెప్పిన చివరి సారీ ఇది. ముగ్గురు కుమార్తెను సూసైడ్ చేసుకునే ముందు రాసిన లెటర్లోని వ్యాఖ్య ఇది. నిర్జీవంగా పడి ఉన్న ముగ్గురు కూతుళ్లను, వాళ్లు చివరి సారీగా రాసిన లెటర్ను చదివిన ఆ తండ్రి ఎంత ఆవేదనకు గురయ్యారో మీ ఊహకే వదిలేస్తున్నా.. అసలు ఏం జరిగిందంటే..
READ MORE: Ricky Ponting: వరల్డ్కప్లో భారత్ ఆశలు అతడిపైనే.. అభిషేక్పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో జరిగిన ఒక హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ళు అపార్ట్మెంట్ తొమ్మిదో అంతస్తు నుంచి దూకిన ప్రాణాలు వదిలారు. మృతుల వయస్సులు 12, 14, 16 సంవత్సరాలు. స్థానికులు భారీ శబ్దం విని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని సీల్ చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సమయానికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటనకు కారణ ఒక కొరియన్ టాస్క్-బేస్డ్ ఆన్లైన్ గేమ్. ఆ గేమ్కు ఈ ముగ్గరు అమ్మాయిలు బానిసలయ్యారని పోలీసులు భావిస్తున్నారు. బాలికల తండ్రి చెతన్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ గేమ్లో మొత్తం 50 టాస్కులు ఉండగా సోమవారం చివరి టాస్క్ పూర్తయిందట. ఈ టాస్క్ పూర్తవ్వగానే ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డట్టు చెబుతున్నారు. “మా పిల్లలు ఇలాంటి టాస్క్ గేమ్ ఆడుతున్నారని నాకు అస్సలు తెలియదు. లూడో లాంటి గేమ్ ఆడుతున్నారు అనుకున్నాను. చనిపోవాలని చెప్పే గేమ్ ఉంటుందని ఊహించలేదు. ఫోరెన్సిక్ నిపుణులే ఈ విషయం చెప్పారు. వారు ఉపయోగించిన మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు,” అని కన్నీళ్లతో బాలికల తండ్రి చెతన్ కుమార్ వెల్లడించారు.
READ MORE: Ricky Ponting: వరల్డ్కప్లో భారత్ ఆశలు అతడిపైనే.. అభిషేక్పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు
అయితే.. ఈ ముగ్గురిలోని ఓ బాలికల గదిలో ఒక పేజీ సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో “ఇది నిజ జీవిత కథ. ఈ డైరీలో ఉన్నది అంతా చదవండి.. ఎందుకంటే ఇవన్నీ నిజమే. రీడ్ నౌ! ఐ యామ్ రియల్లీ సారీ.. సారీ నాన్న” అని రాసి ఉంది. ఆ నోట్లో కన్నీటి ఎమోజీ కూడా డ్రాయింగ్ చేశారు. పోలీసులు ఆ నోట్ను ఆధారంగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే గదిలో కుటుంబ సభ్యుల ఫొటోలు నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు ఆన్లైన్ గేమింగ్ కారణమా అనే విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. “ముగ్గురు బాలికలు తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి దూకారని సమాచారం అందింది. వెంటనే మేము అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అసలు కారణం ఏమిటో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది,” అని ఎస్పీ అతుల్ కుమార్ సింగ్ తెలిపారు. డీసీపీ నిమిష్ పాటిల్ మాట్లాడుతూ.. బాలికలపై కొరియన్ గేమ్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆ గేమ్లో 14 ఏళ్ల బాలిక లీడర్గా ఉండి ఆదేశాలు నిర్ణయించిందని అనుమానం. గేమ్లో భాగంగా బాల్కనీ నుంచి దూకేందుకు రెండు మెట్ల చిన్న లాడర్ వాడినట్టు అనుమానిస్తున్నారు. ఈ గేమ్ను ఎవరు పరిచయం చేశారు? ఎలా మొదలైంది? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ఆన్లైన్ గేమింగ్, పిల్లల మానసిక ఆరోగ్యం, తల్లిదండ్రుల అప్రమత్తతపై తీవ్రమైన చర్చకు దారి తీసింది. పిల్లల డిజిటల్ ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, వారి ప్రవర్తనలో చిన్న మార్పులకైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..