Couple In Bathroom: హోలీ ఆడి బాత్ రూం కెళ్లారు… డెడ్ బాడీలుగా తిరిగివచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Couple In Bathroom: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో పండగ రోజున ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భార్యాభర్తలిద్దరూ హోలీ ఆడి ఇంటికి వెళ్లి బాత్ రూంకెళ్లి చనిపోయారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఈ పండుగను బాగా ఎంజాయ్ చేశారు. అయితే పండగ రోజునే ఓ కుటుంబంలో విషాదం నింపే వార్త ఒకటి బయటకు వచ్చింది. భార్యాభర్తలిద్దరూ హోలీ ఆడి ఇంటికి వెళ్లి బాతురూంలో స్నానానికని వెళ్లి మృత్యువాతపడ్డారు. చనిపోయిన భార్యాభర్తల పేర్లు దీపక్ గోయల్, శిల్పి.
Read Also: YS Viveka murder case: హైకోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి.. ఆ ఆదేశాలు ఇవ్వండి..
Also Read
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని మురాద్నగర్ అగ్రసేన్ మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం భార్యభర్తలు హోలీ ఆడి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ స్నానానికి బాత్రూమ్కి వెళ్లారు. స్నానానికని వెళ్లిన వారు దాదాపు గంట వరకు బయటకు రాలేదు. అనుమానం వచ్చిన వారి పిల్లలు అరవడం స్టార్ట్ చేశారు. దీంతో ఇరుగుపొరుగు వారు గుమిగూడారు. అమ్మా, నాన్న లోపలే ఉన్నారని, బయటకు రాలేదని పిల్లలు చెప్పారు. ఆ తర్వాత ఇరుగుపొరుగు వారు బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా భార్యాభర్తలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు.
Read Also:Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ
ఇంతలో, వెంటనే అంబులెన్స్కు కాల్ చేసి, ఘజియాబాద్లోని ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఇద్దరినీ పరీక్షించగా అప్పటికే వారు చనిపోయినట్లు నిర్ధారించారు. బాత్రూమ్లోని గీజర్ నుంచి గ్యాస్ లీకేజీ కావడంతో ఊపిరాడక ఇద్దరూ మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మృతికి గల కారణాలు పోస్ట్మార్టం రిపోర్టు తర్వాత తేలనుంది.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..