Berlin Bomb Scare: పాపం ఎప్పుడు పోయేవాళ్లో.. జర్మనీలో 80 ఏళ్లుగా పేలని బాంబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Berlin Bomb Scare: జర్మనీ ఒక్కసారిగా షాక్కు గురైంది.. బెర్లిన్ పరిధిలోని మిట్టే జిల్లాలో గురువారం సాయంత్రం స్ప్రీ నది నుంచి రెండవ ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబును అధికారులు బయటికి తీశారు. ఈ బాంబు గత 80 ఏళ్లుగా పేలలేదు. బాంబును గుర్తించిన వెంటనే పోలీసులు 500 మీటర్ల పరిధిలో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, దాదాపు 10 వేల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయమని ఆదేశించారు.
READ ALSO: Jr NTR Injured: ఎన్టీఆర్కు గాయాలు.. షాక్ లో ఫాన్స్!
Also Read
- Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
- Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
- FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
- IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. 'వైభవ్' అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
అసలు ఏంటీ బాంబు కథ..
పలు నివేదికల ప్రకారం.. మిట్టే జిల్లాలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పోలీసులు అకస్మాత్తుగా ప్రజల తలుపులు తట్టడం ప్రారంభించారు. వెంటనే ప్రజలను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. వాళ్లందరిని మిట్టే టౌన్ హాల్కు తరలించారు. అసలు ఏం జరిగిందంటే.. జిల్లాలో గురువారం సాయంత్రం స్ప్రీ నది నుంచి రెండవ ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబును అధికారులు బయటికి తీశారు. నదిలో నాలుగు మీటర్ల లోతులో బాంబు కనిపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన అధికారులు వెంటనే స్థానికులను వారి ఇండ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గురువారం రాత్రి భయం, ఆందోళనతో గడిపిన ప్రజలకు శుక్రవారం ఉదయం కొంత ఉపశమనం లభించింది. బాంబును నిర్వీర్యం చేయవలసిన అవసరం లేదని పోలీసులు ప్రకటించారు. పలు నివేదికల ప్రకారం.. బాంబు స్ప్రీ నదిలో నాలుగు మీటర్ల లోతులో బురదలో పాతుకుపోయి కనిపించింది. ఇది ఆపరేషన్కు ఆటంకం కలిగించిందని అధికారులు చెప్పారు. అధికారుల నుంచి స్పష్టమైన సంకేతం రాగానే ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లడానికి అనుమతించారు. ఇటీవల సంవత్సరాలలో బెర్లిన్లో జరిగిన అతిపెద్ద బాంబు తొలగింపు కార్యకలాపాలలో ఇది ఒకటిగా నిలిచింది.
నేడు స్పాండౌలో..
బెర్లిన్లోని స్పాండౌ జిల్లాలో బుధవారం దొరికిన మరో 100 కిలోల రెండవ ప్రపంచ యుద్ధ బాంబును నేడు (శుక్రవారం) నిర్వీర్యం చేస్తారని అధికారులు తెలిపారు. జిల్లాలో అధికారులు భద్రతా వలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే సమీపంలోని జిమ్ను స్థానిక ప్రజలకు సురక్షిత ఆశ్రయంగా మార్చినట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతం నుంచి దాదాపు 12,400 మందిని తరలించినట్లు పోలీసులు తెలిపారు.
READ ALSO: Scuba Death: సింగర్ ప్రాణాలు తీసిన స్కూబా డైవింగ్..
తాజావార్తలు
-
Hrithik Roshan Divorce: హృతిక్ నుంచి 400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై షాకింగ్ ట్విస్ట్!
-
Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
-
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
-
Explainer: పెట్రోల్ రేట్ల దోపిడీ ఆగేదెప్పుడు..? ఇంధన ధరల మాయాజాలంపై కీలక రిపోర్ట్!
-
Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!