GCC Warns Iran: ముస్లిం దేశాన్ని హెచ్చరించిన 6 గల్ఫ్ దేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GCC Warns Iran: ఒక ముస్లిం దేశాన్ని ఆరు గల్ఫ్ దేశాలు హెచ్చరించాయి. ఎందుకో తెలుసా.. ఇటీవల ఇరాన్ మూడు వివాదాస్పద దీవులను తమ దేశానికి చెందినవిగా పేర్కొంటూ చేసిన ప్రకటనపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసీసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యుఎఇలోని మూడు దీవులు గ్రేటర్ టోన్బ్, లెస్సర్ టోన్బ్, అబు ముసా తమకు చెందినవని ఇరాన్ పేర్కొంది. సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త యాజమాన్యంలోని దుర్రా ఆఫ్షోర్ చమురు క్షేత్రంపై కూడా ఇరాన్ తన హక్కులను నొక్కి చెప్పింది. ఇరాన్ బహ్రెయిన్ సార్వభౌమత్వాన్ని కూడా ప్రశ్నించింది. జీసీసీలో సౌదీ అరేబియా, ఒమన్, యుఎఇ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
READ ALSO: ICC Fine: పాపం టీమిండియా.. మ్యాచ్ ఫీజులో షాక్ ఇచ్చిన ఐసీసీ
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై, పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘర్ గాలిబాఫ్ ఈ దీవులు ఇరానియన్ భూభాగంలోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెం అల్-బుదావి ఇరాన్ ప్రకటనలపై స్పందిస్తూ.. అవి తప్పుదారి పట్టించేవిగా, నిరాధారమైన ఆరోపణలతో ఉన్నాయని అన్నారు. ఇటువంటి ప్రకటనలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తాయని, ముఖ్యంగా ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని, పొరుగువారితో మంచి సంబంధాలను కొనసాగించాలని ఆయన అన్నారు. ఇరాన్ వ్యాఖ్యలు ఆ దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి జీసీసీ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని అల్-బుదావి అన్నారు. గల్ఫ్ దేశాలు ఎల్లప్పుడూ ఇరాన్తో మెరుగైన సంబంధాలను కోరుకుంటాయని, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి గల్ఫ్ దేశాలు సహకరిస్తాయని ఆయన వివరించారు.
సార్వభౌమత్వాన్ని గౌరవించడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, బలప్రయోగం చేయకుండా ఉండటం వంటి UN చార్టర్, అంతర్జాతీయ చట్టాల సూత్రాలకు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని GCC పునరుద్ఘాటించింది. జూన్లో ఖతార్పై దాడి చేయడం ద్వారా ఇరాన్ గతంలో ఈ సూత్రాలను ఉల్లంఘించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. జీసీసీ దేశాలు, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన సమావేశాల సందర్భంగా ఇరుపక్షాలు ప్రాంతీయ స్థిరత్వం గురించి చర్చించాయని చెప్పారు. చివరగా జీసీసీ ఇరాన్ను తప్పుడు ప్రకటనలు చేయడం మానేయాలని కోరింది.
గ్రేటర్ టోన్బ్, లెస్సర్ టోన్బ్, అబు ముసా దీవులు పర్షియన్ గల్ఫ్ (అరేబియా సముద్రంలో భాగం)లో ఉన్నాయి. 1971లో యుఎఇ ఏర్పడటానికి కొంతకాలం ముందు ఇరాన్ ఈ దీవులను తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే యుఎఇ వాటిపై చారిత్రక, చట్టపరమైన హక్కులను క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇరాన్ ఈ దీవులను తన భూభాగంలో అంతర్భాగంగా పరిగణిస్తుంది. హార్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఈ దీవులు సముద్ర వాణిజ్యం, చమురు రవాణాకు కీలకమైనవి, ప్రపంచంలోని చమురు ట్యాంకర్లలో దాదాపు 20% వీటి గుండా వెళుతున్నాయి.
READ ALSO: Sania Mirza: ఈ మహిళా స్టార్ కూడా నిశ్చితార్థం తర్వాతే ‘నో మ్యారేజ్’ డిసిషన్! మీకు తెలుసా..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!