GCC Warns Iran: ముస్లిం దేశాన్ని హెచ్చరించిన 6 గల్ఫ్ దేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GCC Warns Iran: ఒక ముస్లిం దేశాన్ని ఆరు గల్ఫ్ దేశాలు హెచ్చరించాయి. ఎందుకో తెలుసా.. ఇటీవల ఇరాన్ మూడు వివాదాస్పద దీవులను తమ దేశానికి చెందినవిగా పేర్కొంటూ చేసిన ప్రకటనపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసీసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యుఎఇలోని మూడు దీవులు గ్రేటర్ టోన్బ్, లెస్సర్ టోన్బ్, అబు ముసా తమకు చెందినవని ఇరాన్ పేర్కొంది. సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త యాజమాన్యంలోని దుర్రా ఆఫ్షోర్ చమురు క్షేత్రంపై కూడా ఇరాన్ తన హక్కులను నొక్కి చెప్పింది. ఇరాన్ బహ్రెయిన్ సార్వభౌమత్వాన్ని కూడా ప్రశ్నించింది. జీసీసీలో సౌదీ అరేబియా, ఒమన్, యుఎఇ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
READ ALSO: ICC Fine: పాపం టీమిండియా.. మ్యాచ్ ఫీజులో షాక్ ఇచ్చిన ఐసీసీ
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై, పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘర్ గాలిబాఫ్ ఈ దీవులు ఇరానియన్ భూభాగంలోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెం అల్-బుదావి ఇరాన్ ప్రకటనలపై స్పందిస్తూ.. అవి తప్పుదారి పట్టించేవిగా, నిరాధారమైన ఆరోపణలతో ఉన్నాయని అన్నారు. ఇటువంటి ప్రకటనలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తాయని, ముఖ్యంగా ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని, పొరుగువారితో మంచి సంబంధాలను కొనసాగించాలని ఆయన అన్నారు. ఇరాన్ వ్యాఖ్యలు ఆ దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి జీసీసీ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని అల్-బుదావి అన్నారు. గల్ఫ్ దేశాలు ఎల్లప్పుడూ ఇరాన్తో మెరుగైన సంబంధాలను కోరుకుంటాయని, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి గల్ఫ్ దేశాలు సహకరిస్తాయని ఆయన వివరించారు.
సార్వభౌమత్వాన్ని గౌరవించడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, బలప్రయోగం చేయకుండా ఉండటం వంటి UN చార్టర్, అంతర్జాతీయ చట్టాల సూత్రాలకు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని GCC పునరుద్ఘాటించింది. జూన్లో ఖతార్పై దాడి చేయడం ద్వారా ఇరాన్ గతంలో ఈ సూత్రాలను ఉల్లంఘించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. జీసీసీ దేశాలు, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన సమావేశాల సందర్భంగా ఇరుపక్షాలు ప్రాంతీయ స్థిరత్వం గురించి చర్చించాయని చెప్పారు. చివరగా జీసీసీ ఇరాన్ను తప్పుడు ప్రకటనలు చేయడం మానేయాలని కోరింది.
గ్రేటర్ టోన్బ్, లెస్సర్ టోన్బ్, అబు ముసా దీవులు పర్షియన్ గల్ఫ్ (అరేబియా సముద్రంలో భాగం)లో ఉన్నాయి. 1971లో యుఎఇ ఏర్పడటానికి కొంతకాలం ముందు ఇరాన్ ఈ దీవులను తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే యుఎఇ వాటిపై చారిత్రక, చట్టపరమైన హక్కులను క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇరాన్ ఈ దీవులను తన భూభాగంలో అంతర్భాగంగా పరిగణిస్తుంది. హార్ముజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఈ దీవులు సముద్ర వాణిజ్యం, చమురు రవాణాకు కీలకమైనవి, ప్రపంచంలోని చమురు ట్యాంకర్లలో దాదాపు 20% వీటి గుండా వెళుతున్నాయి.
READ ALSO: Sania Mirza: ఈ మహిళా స్టార్ కూడా నిశ్చితార్థం తర్వాతే ‘నో మ్యారేజ్’ డిసిషన్! మీకు తెలుసా..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!