Site icon NTV Telugu

Gautam Gambhir: గంభీర్ వ్యూహం సూపర్ హిట్.. సెమీస్‌లో భారత్ విజయం వెనుక అసలు కథ ఇదే!

Gautam Gambhir Tactical

Gautam Gambhir Tactical

Gautam Gambhir: నిన్న ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. గత కొన్ని నెలల కిందట టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఓ వ్యాఖ్య చేశారు. చిన్న ఫార్మాట్‌లో ఫిక్స్‌డ్ బ్యాటింగ్ ఆర్డర్ అన్నదే లేదని, ప్రత్యేకంగా మిడిల్ ఆర్డర్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను పంపించాలని గంభీర్ అన్నాడు. కొన్ని మ్యాచ్‌లు తన ప్లాన్ వల్ల చేతిలో నుంచి జారిపోయినా, ఈ విధానాన్ని మార్చే ఆలోచన లేదని గంభీర్ స్పష్టం చేశాడు. అప్పట్లో ఆ వ్యాఖ్యపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కానీ ఇంగ్లాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో గంభీర్ వ్యూహం సూపర్ హిట్ అయ్యింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ చర్చకు దారి తీసింది.

READ MORE: Iran-US: ఇరాన్‌పై దాడిని తీవ్రం చేసిన అమెరికా.. బీ-2 బాంబర్లతో దాడి

ఇక నిన్నటి మ్యాచ్‌ విషయానికి వస్తే.. పదో ఓవర్‌లో ఆదిల్ రషీద్ ఇషాన్ కిషన్ వికెట్ తీసినప్పుడు అందరూ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వస్తారని అనుకున్నారు. కానీ భారత్ ఆశ్చర్యకరంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ శివమ్ దూబేను నాలుగో స్థానంలో పంపింది. దానికి స్పష్టమైన కారణం ఉంది. లెగ్ స్పిన్ బౌలింగ్‌ను బలంగా ఎదుర్కొనే బ్యాటర్లలో దూబే ఒకడిగా గుర్తింపు పొందాడు. సంజూ శామ్సన్ రషీద్ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడుతుండగా దూబే మాత్రం దాడి మొదలుపెట్టాడు. కేవలం ఎనిమిది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. తర్వాత సంజూ ఔటైనా భారత్ వ్యూహం మారలేదు. ఎడమచేతి-కుడిచేతి బ్యాటర్ల కలయిక కొనసాగాలని భావించి హార్దిక్ పాండ్యాను క్రీజ్‌లోకి పంపింది. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లకు లైన్, లెంగ్త్ కుదరకపోయింది. దూబే దాడి కారణంగా హ్యారీ బ్రూక్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను ముందుగానే బౌలింగ్‌కు తీసుకురావాల్సి వచ్చింది. భారత్ మాత్రం పరిస్థితిని బట్టి బ్యాటర్లను మార్చుతూ ఇంగ్లాండ్ జట్టును గందరగోళంలో పడేసింది.

READ MORE:Avika Gor : తల్లి కాబోతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’? వైరల్ అవుతున్న అవికా గోర్ లేటెస్ట్ వీడియో!

ఇంకా ఒక ఆసక్తికరమైన నిర్ణయం తిలక్ వర్మను చివరి ఓవర్ల వరకు ఆపడం. ఫాస్ట్ బౌలర్‌ను తిలక్ బాగా ఎదుర్కొంటాడనే నమ్మకం జట్టుకు ఉంది. ఈ వ్యూహం బాగా పని చేసింది. ఈ విధంగా భారత్ ప్రతి దశలో అప్పటి పరిస్థితులకు సరిపోయే బ్యాటర్‌ను పంపుతూ మ్యాచ్‌ను తన చేతుల్లో ఉంచుకుంది. భారత్ ప్రతిభ కేవలం బ్యాటింగ్‌లోనే కాదు. బౌలింగ్‌లోనూ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. వాంఖడే మైదానంలో రాత్రి సమయంలో పిచ్ బ్యాటర్లకు ఈజీగా మారుతుందని భారత జట్టు ముందే అంచనా వేసింది. అందుకే మొదట్లోనే వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలో పెట్టాలని నిర్ణయించింది. హార్దిక్ పాండ్యాను తొందరగా బౌలింగ్‌కు తీసుకువచ్చి మొదటి బంతికే ఫిల్ సాల్ట్ వికెట్ తీసింది భారత్. మరోవైపు జస్ప్రీత్ బుమ్రాను పవర్ ప్లేలోనే ఉపయోగించి హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయాలని వ్యూహం రచించారు. బుమ్రా వేగం మార్పుతో వేసిన బంతికి బ్రూక్ తప్పుగా ఆడగా అక్షర్ పటేల్ వెనక్కి పరుగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఇంకా ముఖ్యంగా చివరి పది ఓవర్ల కోసం బుమ్రా మూడు ఓవర్లను ఆపడం భారత్ చేసిన గొప్ప వ్యూహం. పదహారు, పద్దెనిమిదో ఓవర్లలో బుమ్రా వేసిన బౌలింగ్ ఇంగ్లాండ్ ఆశలను దాదాపు ముగించింది. అప్పటికే ఇంగ్లాండ్‌కు ప్రతి ఓవర్‌కు పద్నాలుగు పరుగులు అవసరం. కానీ బుమ్రా కేవలం పద్నాలుగు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు.

Exit mobile version