Mohammad Kaif: గంభీర్ కోచింగ్పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ రివ్యూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Kaif: నరాలు తెగే ఉత్కంఠ మధ్య టీం ఇండియా తెందుల్కర్- అండర్సన్ ట్రోఫీలో ఐదో మ్యాచ్ గెలిచింది. గెలుపు కోసం మైదానంలో ఉన్న ప్లేయర్స్ మాత్రమే మరోకరూ కూడా తీవ్రంగా ఒత్తిడికి గురయ్యారు. ఆయన మరెవరో కాదు టీం ఇండియా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్లో ఈ టెస్ట్ సిరీస్ మీద, చీఫ్ కోచ్పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
READ MORE:Harish Rao : మహిళా ఎమ్మెల్యే అవమానం సిగ్గుచేటు.. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
Also Read
- IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
గంభీర్ తీసుకున్న నిర్ణయం సరైనదే…
కైఫ్ కోచ్గా గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడుతూ.. ‘మనమంతా బుమ్రా గైర్హాజరీలో కుల్దిప్ను ఆడించాలన్నాం. కానీ గంభీర్ బ్యాటింగ్ డెప్త్ గురించి ఆలోచించాడు. బ్యాటింగ్లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ను చూశాం. బ్యాటింగ్లో డెప్త్ ఉండటం వల్లే టీమ్ ఇండియా భారీ స్కోర్లు చేయగలిగింది. అతడు ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉండాలని కోరుకున్నాడు. అతడి నిర్ణయమే సరైనదని నిరూపించుకున్నాడు. ఈ కారణంగా భారత్ ఈ సిరీస్ను డ్రా చేసుకుందనడంలో సందేహం లేదు. గంభీర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో ప్రస్తుతం టీమ్ ఇండియా నిండి ఉంది. ఈ నేపథ్యంలో కోచ్గా గంభీర్ మీద ఎంత ఒత్తిడి ఉండి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.. అని పేర్కొన్నాడు.
చీఫ్ కోచ్పైనే ఎక్కువ ఒత్తిడి..
తెందుల్కర్- అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్, టీమ్ ఇండియా మధ్య జరిగిన అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఇరుజట్లూ రెండు మ్యాచ్లు గెలవగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగియడంతో సిరీస్ 2-2తో సమమైంది. ఈ సిరీస్పై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందరికన్నా ఎక్కువ ఒత్తిడి ఈ టూర్లో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మీద ఉందని అన్నాడు. ఎందుకు ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడనేది వివరిస్తూ.. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా పర్ఫామెన్స్ అద్భుతంగా లేదని, స్వదేశంలో కూడా న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని భారత్ మూటగట్టుకుందని గుర్తు చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమ్ ఇండియా చెప్పుకోదగ్గ ఆట తీరును ప్రదర్శించలేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను ఒకవేళ భారత్ కోల్పోయి ఉంటే.. గౌతమ్ గంభీర్ కోచ్ పదవి ప్రమాదంలో పడేదని అన్నారు. బహుశా అతడికి కోచ్గా ఇదే ఆఖరి టెస్ట్ మ్యాచ్ కూడా అయి ఉండేదేమో. కానీ అలా జరగరకపోవడం సంతోషకరం అని అన్నాడు.
READ MORE: Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ అనకండి నేను గేమింగ్ యాప్ ప్రమోట్ చేశా !
తాజావార్తలు
-
IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
-
Big Alert : ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
-
SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!