NTV Telugu Site icon

Gang Rape Case : మియాపూర్‌లో గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులు అరెస్ట్‌

Arrest

Arrest

మియాపూర్‌లో గ్యాంగ్ రేప్ కేసు పురోగతి లభించింది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసులు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ మెన్ లు గ్యాంగ్ రేప్ పాల్పడ్డారని, సైట్ విజిట్ కోసం అని చెప్పి యువతిని హాస్టల్ నుంచి పికప్ చేసుకున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట వద్ద నిర్మానుష భవనం లో కారుని నిలిపివేశారని, కారు చెడిపోయిందని చెప్పి యువతికి సాకుగా చూపెట్టారని పోలీసులు పేర్కొన్నారు. యువతి చేత బలవంతంగా ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేశారని, యువతి ఆహారం తినకపోవడంతో కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చారని, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతి కి యువకులు తాగించారని పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో యువతికి కి కొంత ఆహార పదార్థాలు కూడా బలవంతంగా తినిపించారని, కారులోనే యువతి స్పృహా కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. యువతికి స్పృహా వచ్చిన తర్వాత హాస్టల్లో వదిలిపెట్టి వెళ్లిపోయారని, యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని విచారణ జరిపామని పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ రేప్ జరిపిన సంగారెడ్డి, జనార్ధలపై చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదు చేసిందని, యువతి ఫిర్యాదు పైన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.