G-20 Countries: శ్రీ అన్న సాగు వినియోగాన్ని పెంచడానికి అంగీకరించిన జీ-20 దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G-20 Countries: భారతదేశం అధ్యక్షతన జరిగిన జీ-20 అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ మూడు రోజుల సమావేశంలో, సుస్థిర వ్యవసాయం కోసం జ్ఞానం, అనుభవం, ఆవిష్కరణల ప్రపంచ భాగస్వామ్యానికి శనివారం ప్రాధాన్యత ఇవ్వబడింది. శ్రీఅన్న సాగు, వినియోగాన్ని పెంచడానికి జీ-20 దేశాలు అంగీకరించాయి. ఈ సమయంలో భారతదేశం ప్రతిపాదనపై, సభ్య దేశాలు శ్రీ అన్న సాగును ప్రోత్సహించడంలో దాని వినియోగాన్ని పెంచడంలో సహకరించడానికి అంగీకరించాయి. మహిళలు, యువత భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవచ్చని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. మార్పు తీసుకురావచ్చని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్నారు. జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు
Also Read
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశంలో జీ-20 సభ్య దేశాల వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు. వారణాసి సమావేశంలో ఇంటర్నేషనల్ శ్రీఅన్న అండ్ ఏన్షియంట్ గ్రెయిన్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (మహర్షి) ప్రారంభించడానికి G-20 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయని కేంద్ర వ్యవసాయ మంత్రి తెలియజేశారు. ఈ సమావేశం లక్ష్యం ప్రపంచంలోని దేశాల్లో శ్రీఅన్న, ఇతర సాంప్రదాయ తృణధాన్యాల సాగు, వినియోగాన్ని పెంచడం, ఇది పోషక విలువలతో పాటు ఆహార భద్రతకు దోహదపడుతుంది. పరిశోధన, జ్ఞాన మార్పిడి, సాంకేతిక సహకారం ద్వారా శ్రీ అన్నను ప్రోత్సహించడం ఈ సమావేశం లక్ష్యం. సభ్య దేశాలు కూడా ‘దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలపై అంగీకరించాయని ఆయన చెప్పారు. ఈ సూత్రాలు స్థిరమైన, సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో మైలురాళ్లుగా పనిచేస్తాయి. భారతదేశం వ్యవసాయంలో ఉజ్వల భవిష్యత్తును సృష్టించడంపై దృష్టి పెట్టింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఆవిష్కరణ, సాంకేతికత బదిలీపై కూడా సమావేశంలో ఉద్ఘాటించారు. ఈ రంగంలో భారతదేశం చాలా కృషి చేసింది.
Also Read: Income Tax Filing: ఫారమ్-16 లేకుండా కూడా ఐటీఆర్ ఫైలింగ్ ఫైల్ చేయవచ్చు.. ఎలానో తెలుసుకోండి?
సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను భారతదేశం అర్థం చేసుకుంటుందని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతులకు మేలు చేసే విధానాలు, కార్యక్రమాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన భూగోళాన్ని అందజేయడం మన బాధ్యత కాబట్టి, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భారతదేశం కూడా కలిసి పనిచేయాలని కోరుతోందన్నారు. వ్యవసాయం, ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సాధనాలు, పరిజ్ఞానాన్ని రైతులకు అందజేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!