FPI Investment : మోడీ ప్రభుత్వ విధానాలు.. వెల్లువలా వస్తున్న విదేశీ పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FPI Investment : భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పిఐ) పెట్టుబడులు పెరుగుతున్నాయి. జనవరి మొదటి వారంలో స్టాక్ మార్కెట్లలో దాదాపు రూ.4,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీ డేటా ప్రకారం.. వారు రుణం లేదా బాండ్ మార్కెట్లో కూడా రూ.4,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2024లో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయని, దీని కారణంగా ఎఫ్పిఐలు తమ కొనుగోళ్లను పెంచుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కొత్త సంవత్సరం ప్రారంభ నెలల్లో తన పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Read Also:Shiva Stotram: సోమవారం భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలు వింటే సర్వ పాపాల నుంచి విముక్తి..
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ఇది కాకుండా, రుణ మార్కెట్లో ఎఫ్పిఐ ప్రవాహం కూడా 2024లో బాగుంటుందని ఆయన అన్నారు. డేటా ప్రకారం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెల (జనవరి 5 వరకు) భారతీయ షేర్లలో రూ.4,773 కోట్ల నికర పెట్టుబడి పెట్టారు. అంతకుముందు డిసెంబరులో రూ.66,134 కోట్లు, నవంబర్లో రూ.9,000 కోట్లు పెట్టారు. ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ప్రకటనల కోసం గత వారం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్న తరుణంలో ఎఫ్పిఐ పెట్టుబడులు వచ్చాయని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్, మేనేజ్మెంట్ రీసెర్చ్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు.
Read Also:IND vs AUS: బ్యాటర్ల వైఫల్యం.. రెండో టీ20లో భారత్ ఓటమి!
మొత్తంమీద గత సంవత్సరం అంటే 2023లో FPIలు భారతీయ మార్కెట్లలో రూ. 2.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇందులో రూ.1.71 లక్షల కోట్లను షేర్లలో, రూ.68,663 కోట్లను రుణం లేదా బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. 2023-24లో భారత రైల్వే బడ్జెట్ కూడా రూ.2.4 లక్షల కోట్లు. భారతదేశం నుండి దేశీయ పెట్టుబడిదారుల నిరంతర ప్రవాహం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి మంచి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) గణాంకాలు, కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు, బ్యాంకుల మంచి ఆరోగ్యం ఆకట్టుకుంటున్నాయని ఫిడెల్ ఫోలియో స్మాల్కేస్ వ్యవస్థాపకుడు కిస్లే ఉపాధ్యాయ్ అన్నారు. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారు.
తాజావార్తలు
-
Peddi : వేట షురూ.. ‘రాంబుజ్జి’గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!