Shocking Incident: ఒకబ్బాయిపై నలుగురు అమ్మాయిలు సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: దేశంలో ఎక్కడో ఓ చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పంజాబ్లోని జలంధర్కు చెందిన ఓ వ్యక్తి 20 నుంచి 23 ఏళ్ల వయస్సు గల నలుగురు అమ్మాయిలు తెల్లని కారులో కిడ్నాప్ చేసి తన కళ్లలో ఏదో రసాయనం చల్లి తనకు మత్తుమందు ఇచ్చి అటవీ ప్రాంతంలో లైంగికంగా వేధించారని ఆరోపించాడు. ఆ తర్వాత తనను నలుగురు మహిళలు రాత్రిపూట ఏకాంత ప్రదేశంలో పడవేశారని కూడా ఆరోపించింది. వారంతా పెద్దింటి పిల్లల్లా ఉన్నారని.. ఇంగ్లీష్తో పాటు పంజాబీలో మాట్లాడారని అతను మీడియాతో తెలిపాడు. అయితే సదరు వ్యక్తి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తనను అపస్మారక స్థితికి తీసుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయాడు. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీయడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతను స్థానిక మీడియాకు తన కష్టాలను వివరించాడు. తనకు గతంలోనే వివాహం అయిందని.. పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. సజీవంగా తిరిగి వచ్చినందున ఫిర్యాదు చేయవద్దని తన భార్య కోరిందని.. అందుకే ఫిర్యాదు చేయలేదని వెల్లడించాడు. లైంగిక ఉద్దేశంతోనే కిడ్నాప్ చేశారని ఆ వ్యక్తి ఆరోపించాడు. మొత్తం ఘటనను మీడియా ప్రతినిధులతో వివరిస్తూ.. తాను లెదర్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నానని చెప్పాడు.
బాధితుడి కథనం ప్రకారం.. సదరు వ్యక్తి కూలీ పనులు చేసుకుంటున్నాడు. సోమవారం పని ముగిశాక కపుర్తలా రోడ్లో సోమవారం ఇంటికి వెళుతుండగా నలుగురు అమ్మాయిలు ఉన్న తెల్లటి కారు అతని సమీపంలో ఆగింది. కారు డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయి తను ఇచ్చిన స్లిప్పై అడ్రస్ను అడిగింది. అతను స్లిప్ని చూడటం ప్రారంభించిన వెంటనే, ఆ అమ్మాయి అతని కళ్ళలో ఏదో స్ప్రే చేసిందని, ఆ తర్వాత అతను ఏమీ చూడలేకపోయాడు. చివరికి స్పృహతప్పి పడిపోయాడు. ఆపై కారులో అతని కాళ్లు చేతులు కట్టేసి.. కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికలు అతడిని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అతనికి ఏవో ఇంజెక్షన్లు ఇచ్చి.. అక్కడ మత్తు మందు తాగించారు. ఆపై ఆ నలుగురు అమ్మాయిలు ఆ వ్యక్తిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Also Read
- 8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
Clash in school over hijab: స్కూల్లోనూ హిజాబ్ వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరీక్షలు రద్దు
ఘాతుకం తర్వాత అర్ధరాత్రి సమయంలో తిరిగి అతన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న అతను.. భార్యకు జరిగిన విషయం చెప్పాడు. భార్యాబిడ్డలు ఉండడంతో పరువు పోతుందనే భయంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే భార్య బలవంతం మేరకు స్థానిక మీడియా ముందుకు వచ్చి తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ కథనాలు సంచలనం సృష్టించడంతో పంజాబ్ పోలీసు నిఘా విభాగం సుమోటోగా కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించింది. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతని కళ్లకు గంతలు కట్టి చేతులు కట్టేసి అక్కడి నుంచి బాలికలు వెళ్లిపోయారు. అమ్మాయిలు మంచి కుటుంబాలకు చెందిన వారిలా కనిపిస్తున్నారని ఆ వ్యక్తి విలేకరులతో చెప్పాడు. అందరూ తమలో తాము ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడుకున్నారు. అయితే, వారు అతనితో పంజాబీలోనే మాట్లాడారు. ఈ వార్తల నేపథ్యంలో పంజాబ్ పోలీసుల ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయంపై సుమోటోగా విచారణ ప్రారంభించిందని నివేదికలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్కు చావోరేవో.. ప్లేఆఫ్స్కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!