Shocking Incident: ఒకబ్బాయిపై నలుగురు అమ్మాయిలు సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: దేశంలో ఎక్కడో ఓ చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పంజాబ్లోని జలంధర్కు చెందిన ఓ వ్యక్తి 20 నుంచి 23 ఏళ్ల వయస్సు గల నలుగురు అమ్మాయిలు తెల్లని కారులో కిడ్నాప్ చేసి తన కళ్లలో ఏదో రసాయనం చల్లి తనకు మత్తుమందు ఇచ్చి అటవీ ప్రాంతంలో లైంగికంగా వేధించారని ఆరోపించాడు. ఆ తర్వాత తనను నలుగురు మహిళలు రాత్రిపూట ఏకాంత ప్రదేశంలో పడవేశారని కూడా ఆరోపించింది. వారంతా పెద్దింటి పిల్లల్లా ఉన్నారని.. ఇంగ్లీష్తో పాటు పంజాబీలో మాట్లాడారని అతను మీడియాతో తెలిపాడు. అయితే సదరు వ్యక్తి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తనను అపస్మారక స్థితికి తీసుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయాడు. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీయడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతను స్థానిక మీడియాకు తన కష్టాలను వివరించాడు. తనకు గతంలోనే వివాహం అయిందని.. పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. సజీవంగా తిరిగి వచ్చినందున ఫిర్యాదు చేయవద్దని తన భార్య కోరిందని.. అందుకే ఫిర్యాదు చేయలేదని వెల్లడించాడు. లైంగిక ఉద్దేశంతోనే కిడ్నాప్ చేశారని ఆ వ్యక్తి ఆరోపించాడు. మొత్తం ఘటనను మీడియా ప్రతినిధులతో వివరిస్తూ.. తాను లెదర్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నానని చెప్పాడు.
బాధితుడి కథనం ప్రకారం.. సదరు వ్యక్తి కూలీ పనులు చేసుకుంటున్నాడు. సోమవారం పని ముగిశాక కపుర్తలా రోడ్లో సోమవారం ఇంటికి వెళుతుండగా నలుగురు అమ్మాయిలు ఉన్న తెల్లటి కారు అతని సమీపంలో ఆగింది. కారు డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయి తను ఇచ్చిన స్లిప్పై అడ్రస్ను అడిగింది. అతను స్లిప్ని చూడటం ప్రారంభించిన వెంటనే, ఆ అమ్మాయి అతని కళ్ళలో ఏదో స్ప్రే చేసిందని, ఆ తర్వాత అతను ఏమీ చూడలేకపోయాడు. చివరికి స్పృహతప్పి పడిపోయాడు. ఆపై కారులో అతని కాళ్లు చేతులు కట్టేసి.. కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికలు అతడిని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అతనికి ఏవో ఇంజెక్షన్లు ఇచ్చి.. అక్కడ మత్తు మందు తాగించారు. ఆపై ఆ నలుగురు అమ్మాయిలు ఆ వ్యక్తిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Also Read
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
Clash in school over hijab: స్కూల్లోనూ హిజాబ్ వివాదం.. రెండు వర్గాల మధ్య ఘర్షణ, పరీక్షలు రద్దు
ఘాతుకం తర్వాత అర్ధరాత్రి సమయంలో తిరిగి అతన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న అతను.. భార్యకు జరిగిన విషయం చెప్పాడు. భార్యాబిడ్డలు ఉండడంతో పరువు పోతుందనే భయంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే భార్య బలవంతం మేరకు స్థానిక మీడియా ముందుకు వచ్చి తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ కథనాలు సంచలనం సృష్టించడంతో పంజాబ్ పోలీసు నిఘా విభాగం సుమోటోగా కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించింది. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతని కళ్లకు గంతలు కట్టి చేతులు కట్టేసి అక్కడి నుంచి బాలికలు వెళ్లిపోయారు. అమ్మాయిలు మంచి కుటుంబాలకు చెందిన వారిలా కనిపిస్తున్నారని ఆ వ్యక్తి విలేకరులతో చెప్పాడు. అందరూ తమలో తాము ఎక్కువగా ఇంగ్లీషులోనే మాట్లాడుకున్నారు. అయితే, వారు అతనితో పంజాబీలోనే మాట్లాడారు. ఈ వార్తల నేపథ్యంలో పంజాబ్ పోలీసుల ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయంపై సుమోటోగా విచారణ ప్రారంభించిందని నివేదికలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!