మొయినాబాద్ అడ్వకేట్ స్వప్న మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అడ్వకేట్ స్వప్నని హత్య చేసిన సొంత అన్న రాజు తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజుతో పాటు కావళి శివలింగం, వడ్డే వీరేష్, ఎర్రోళ్ల సందీప్ లు అరెస్టయ్యారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. మోయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసు వివరాలు.. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ గోటికె స్వప్న దారుణ హత్యకు గురైంది. భూమి వివాదమే హత్యకు కారణమని పోలీసుల నిర్ధారించారు.
సర్వే నంబర్ 339లోని 4 ఎకరాల భూమిపై వివాదం చోటుచేసుకుంది. అడ్వకేట్ స్వప్న భూమి సర్వే కోసం వెళ్లిన సమయంలో దాడి కి పాల్పడ్డారు నిందితులు.. మొదటగా కారుతో ఢీకొట్టి, తర్వాత రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేశారు. తీవ్ర గాయాలపాలైన స్వప్న ఘటన స్థలంలోనే మృతి చెందింది. హత్య అనంతరం ఇన్నోవా కార్, స్కూటీ మీద నిందితులు పరారయ్యారు. ఇన్నోవా కారు, స్కూటీ సీజ్, నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లు స్వాధీనం..హత్యకు ఉపయోగించిన కొడవలి సీజ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు
A1 గోటికె రాజు
A2 ఎర్రోళ్ల సందీప్
A3 వడ్డె వీరేశం..
A4 కావలి శివలింగం.
