VBIT College : విద్యార్థినుల ఫోటో మార్ఫింగ్ కేసు.. ఆ నలుగురే నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VBIT College : ఘట్కేసర్ మండలంలోని వీబీఐటీ కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు ప్రదీప్ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు. ప్రదీప్తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన వారిని సైతం ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్ డీపీలతో పాటు ఏకంగా ఫోన్ డాటా మొత్తాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్నెట్లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని ప్రదీప్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేధింపులను భరించలేక యువతులు విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Read Also: Caucasian Shepherd Dog: రూ.100కోట్లు ఇచ్చినా ఆ కుక్కను అమ్మేదిలేదు.. అవన్నీ పుకార్లు
Also Read
- Kapil Dev: "వైభవ్లో సచిన్, కోహ్లీ స్థాయి టాలెంట్ ఉంది కానీ".. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ బిగ్ వార్నింగ్!
- AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!
- American Independence: అమెరికా స్వాతంత్య్రానికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సహాయం.. ఎలాగంటే..
- Govt Hikes Price: ఉల్లి రైతులకు భారీ శుభవార్త.. రైతుల పంట పండినట్లే..
డీపీలను మార్ఫింగ్ చేసి వీబీఐటీ కాలేజీ విద్యార్థినీలను వేధింపులకు గురి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను వేధించిన నలుగురు సైబర్ చీటర్స్ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. నిందితుల పేర్లు గణేష్, ప్రదీప్, సతీష్, దుర్గాప్రసాద్గా వెల్లడించారు. నిందితులు సోషల్మీడియాలో ప్రత్యేక గ్రూప్స్ ఏర్పాటు చేసి కాలేజీ విద్యార్థినులను వేధిస్తున్నారని తెలిపారు. నిందితులపై ఐపీసీ, ఐటీ, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని సీపీ చౌహాన్ తెలిపారు. కాగా వీబీఐటీ కాలేజీ ఘటనలో తొలుత ఫస్టియర్ విద్యార్థినిని నిందితుడు ప్రదీప్ ట్రాప్ చేశాడు. విద్యార్థిని ద్వారా ప్రదీప్ కాలేజీ గ్రూప్లో చేరాడు. ‘ఎంటర్ ద డ్రాగన్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశారు. లింకులను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి.. వాటి ద్వారా అమ్మాయిల ఫోన్లను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. గ్రూప్లో అమ్మాయిల నెంబర్లు సేకరించి నిందితులు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Venky Anil5 : ఆ సినిమా రీమేక్ కాదు.. కీర్తి సురేష్ కీలక వ్యాఖ్యలు
-
Kapil Dev: “వైభవ్లో సచిన్, కోహ్లీ స్థాయి టాలెంట్ ఉంది కానీ”.. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ బిగ్ వార్నింగ్!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!
-
American Independence: అమెరికా స్వాతంత్య్రానికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సహాయం.. ఎలాగంటే..
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..