VBIT College : విద్యార్థినుల ఫోటో మార్ఫింగ్ కేసు.. ఆ నలుగురే నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VBIT College : ఘట్కేసర్ మండలంలోని వీబీఐటీ కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు ప్రదీప్ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు. ప్రదీప్తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన వారిని సైతం ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్ డీపీలతో పాటు ఏకంగా ఫోన్ డాటా మొత్తాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్నెట్లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని ప్రదీప్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేధింపులను భరించలేక యువతులు విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Read Also: Caucasian Shepherd Dog: రూ.100కోట్లు ఇచ్చినా ఆ కుక్కను అమ్మేదిలేదు.. అవన్నీ పుకార్లు
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
డీపీలను మార్ఫింగ్ చేసి వీబీఐటీ కాలేజీ విద్యార్థినీలను వేధింపులకు గురి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను వేధించిన నలుగురు సైబర్ చీటర్స్ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. నిందితుల పేర్లు గణేష్, ప్రదీప్, సతీష్, దుర్గాప్రసాద్గా వెల్లడించారు. నిందితులు సోషల్మీడియాలో ప్రత్యేక గ్రూప్స్ ఏర్పాటు చేసి కాలేజీ విద్యార్థినులను వేధిస్తున్నారని తెలిపారు. నిందితులపై ఐపీసీ, ఐటీ, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని సీపీ చౌహాన్ తెలిపారు. కాగా వీబీఐటీ కాలేజీ ఘటనలో తొలుత ఫస్టియర్ విద్యార్థినిని నిందితుడు ప్రదీప్ ట్రాప్ చేశాడు. విద్యార్థిని ద్వారా ప్రదీప్ కాలేజీ గ్రూప్లో చేరాడు. ‘ఎంటర్ ద డ్రాగన్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశారు. లింకులను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసి.. వాటి ద్వారా అమ్మాయిల ఫోన్లను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. గ్రూప్లో అమ్మాయిల నెంబర్లు సేకరించి నిందితులు బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!