Tamil Nadu: లోక్సభ అభ్యర్థికి ‘చిలుక జోస్యం’.. వ్యక్తి అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికలకు రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో.. తమిళనాడులోని కడలూరు లోక్సభ నియోజకవర్గం ప్రజల భవిష్యత్తును అంచనా వేస్తున్న చిలుక యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఉన్న.. కడలూరు పీఎంకే అభ్యర్థి తంగర్ బచ్చన్ ఓ చెట్టు కిందకు వచ్చి సేదతీరుతుండగా, చిలుక జోస్యుడు కనపడ్డాడు. దీంతో తనకు జోస్యం చెప్పమని అడిగారు. ఆ చిలుక జోస్యుడు బోనులో ఉన్న చిలుకను బయటకు రప్పించి అయ్యనార్ చిత్రపటం కలిగిన చిట్టాను చూపారు. అయ్యనార్ పటం రావటంతో ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారంటూ తంగర్బచ్చన్కు తెలిపారు. ఆ మాటలకు సంతోషించిన తంగర్బచ్చన్ ఆ చిలుక జోస్యుడికి చిల్లర ఇచ్చి వెళ్ళిపోయారు.
తంగర్బచ్చన్ చిలుక జోస్యం చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో.. చిలుకను బందీగా ఉంచినందుకు దాని యజమాని సెల్వరాజ్ను అరెస్టు చేశారు. కాగా.. చిలుక యజమాని దానిని బందిఖానాలో ఉంచాడని అటవీశాఖ అధికారులు ఆరోపించారు. వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 ప్రకారం చిలుకలను ‘షెడ్యూల్ II జాతులు’గా వర్గీకరించారని, వాటిని బందీలుగా ఉంచడం నేరమని ఫారెస్ట్ రేంజర్ జె. రమేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. చిలుక యజమానికి రూ. 10,000 వరకు జరిమానా, వార్నింగ్ ఇచ్చి సెల్వరాజ్ను వదిలిపెట్టనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
Also Read
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
తమిళనాడులోని కడలూరు లోక్సభ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. కడలూరు లోక్సభకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా, ప్రస్తుతం ఓటింగ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ముందు అన్ని రాజకీయ పార్టీలు అట్టడుగు స్థాయిలో బలపడే పనిలో నిమగ్నమై ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు చెందిన టీఆర్వీఎస్ రమేష్ కడలూరు నుంచి పీఎంకే అభ్యర్థి డాక్టర్ ఆర్ గోవిందసామిపై దాదాపు రూ. 1.5 లక్షల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, పీఎంకే మధ్య పొత్తు ఉండడంతో పీఎంకే తన అభ్యర్థిగా తంగర్ బచ్చన్ ను ఎంపిక చేసింది. అదే సమయంలో కాంగ్రెస్-డీఎంకే ఇన్ ఇండియా పొత్తులో ఈ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి రావడంతో ఆ పార్టీ ఎంకే విష్ణుప్రసాద్ను రంగంలోకి దింపింది.
తాజావార్తలు
-
Scene: పోలీస్ ఆఫీసర్గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!