Natwar Singh: మాజీ విదేశాంగ మంత్రి కన్నుమూత..

  • ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ (95) కన్నుమూత
  • . గత కొంత కాలంగా అనారోగ్యం
  • గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
  • కేంద్ర మాజీ మంత్రి మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సంతాపం
Natwar Singh

Natwar Singh

దేశ మాజీ విదేశాంగ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ (95) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. నట్వర్ సింగ్ ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, యూపీఏ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలో మంత్రిగా పనిచేశారు. సింగ్ రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా నివాసి. ఆయన అజ్మీర్‌లోని మాయో కాలేజీ, గ్వాలియర్‌లోని సింధియా స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. కేంద్ర మాజీ మంత్రి మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సంతాపం తెలిపారు.

READ MORE:Narsingi Crime: మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజనీర్లకు తీవ్ర గాయాలు..

ముఖ్యమంత్రి.. “నట్వర్ సింగ్ జీ మరణవార్త చాలా బాధాకరం. ఈ దుఃఖ ఘడియలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.” అని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా కూడా నట్వర్ సింగ్ మృతి పట్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సంతాపం వ్యక్తం చేశారు. “మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ జీ మరణవార్త బాధాకరం. భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.” అని పేర్కొన్నారు.

READ MORE:Girls Missing: ధవలేశ్వరంలో కిడ్నాప్కు గురైన ఇద్దరు బాలికల కోసం పోలీసుల గాలింపు..

కున్వర్ నట్వర్ సింగ్ ఎవరు?
మే 2004 నుంచి డిసెంబర్ 2005 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. సింగ్ 1953లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో ఎంపికయ్యారు. 1984లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వీసుకు రాజీనామా చేశారు. 1984 నుంచి 1989 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2004లో భారత విదేశాంగ మంత్రి అయ్యే వరకు అతని రాజకీయ జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంది.