Site icon NTV Telugu

Flipkart: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. 30 సెకన్లలోనే పర్సనల్‌ లోన్‌..

Flipkart

Flipkart

Flipkart: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ రిటైలర్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ తన యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.. తన ప్లాట్‌ఫారమ్‌లో యాక్సిస్ బ్యాంక్ సౌజన్యంతో వ్యక్తిగత రుణ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లోని కస్టమర్లు మూడేళ్ల వరకు యాక్సిస్ బ్యాంక్ నుండి రూ. 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను పొందగలరని ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు 45 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. స్టేట్‌మెంట్ ప్రకారం, ఈ భాగస్వామ్యం కింద కస్టమర్‌లు 30 సెకన్లలోపు రుణ ఆమోదం పొందుతారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వ్యక్తిగత రుణాలు మరియు క్రెడిట్ కార్డ్‌ల వంటి అధిక-రిస్క్ రుణాలలో అధిక వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదికల మధ్య ఈ ప్రకటన వచ్చింది.

Read Also: Madhu Yaskhi Goud: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బిఆర్ఎస్ పార్టీది

మా ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఇప్పటికే బై నౌ పే లేటర్ (BNPL), ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (EMIలు) మరియు క్రెడిట్ కార్డ్‌ల వంటి ఆర్థిక సేవలను అందిస్తోంది అని ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా అన్నారు. యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ సమీర్ శెట్టి మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ద్వారా, బ్యాంక్ విస్తృత సెగ్మెంట్ కస్టమర్లకు క్రెడిట్ సౌకర్యాలను అందించనుందని తెలిపారు. ఇక, రూ. 5 లక్షల వరకు లోన్‌ తీసుకునే అవకాశం ఉండగా.. ఆ మొత్తాన్ని 6 నుండి 36 నెలల వరకు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ చేసుకోవచ్చు.. మరోవైపు పర్సనల్‌ లోన్‌ అంటే బ్యాంకులు ఎన్నో రకాల షరతులు పెడుతున్నాయి.. అడిగినన్ని వివరాలు సమర్పించాల్సిందే కానీ, కస్టమర్లు తమ లోన్‌ల ఆమోద ప్రక్రియ కేవలం 30 సెకన్లలో పూర్తవుతుందని ఫ్లిప్‌కార్ట్‌ చెబుతోంది.. లోన్ దరఖాస్తును ప్రారంభించడానికి, కస్టమర్లు.. వారి పాన్, పుట్టిన తేదీ మరియు చేస్తున్న జాబ్‌ వంటి వివరాలను అందించాలని పేర్కొంది.

Exit mobile version