Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
- బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
- ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. 27 మంది గాయపడ్డారు. లంబి నియోజకవర్గానికి సమీపంలోని సింఘేవాలా-ఫుతుహివాలా గ్రామంలోని పొలాల్లో ఉన్న బాణసంచా కర్మాగారంలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. గాయపడిన వారిని బతిండా ఎయిమ్స్కు తరలించారు. ఈ పేలుడులో, ఫ్యాక్టరీ భవనంలోని రెండు అంతస్తులు క్షణాల్లో పేక ముక్కలా కుప్పకూలాయి. కర్మాగారంలో బాణసంచా తయారీ పని ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ నివాసి అయిన కాంట్రాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుండగా, సంఘటన జరిగినప్పటి నుంచి కాంట్రాక్టర్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read:Liquor Case: లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి నలుగురు నిందితులు.. విచారణకు కోర్టు అనుమతి..!
Also Read
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఫ్యాక్టరీ ప్యాకింగ్ యూనిట్లో పనిచేస్తున్న వలస కార్మికుల ప్రకారం, దాదాపు 40 మంది ఉద్యోగులు అక్కడ రెండు షిఫ్టులలో పనిచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ మంది ఉద్యోగులు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారని చెబుతున్నారు. ఆర్టిసన్ అరుణ్ సక్సేనా మాట్లాడుతూ, తాను అర్థరాత్రి ఫ్యాక్టరీ ముందు నిద్రపోతున్నానని చెప్పాడు. అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని తెలిపాడు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఎస్పీ డాక్టర్ అఖిల్ చౌదరి, ఎస్పీ (డి) మన్మీత్ సింగ్, లంబి డిఎస్పీ జస్పాల్ సింగ్, కిలియన్వాలి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి కరమ్జిత్ కౌర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read:Am Ratnam : ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోవడంపై దయాకర్ క్లారిటీ..
డేరా సచ్చా సౌదా సిర్సాకు చెందిన గ్రీన్ ఎస్ ఫోర్స్ కార్మికులు సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. హైడ్రో మెషిన్ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ కర్మాగారం సింఘే వాలా-ఫుతుహివాలాకు చెందిన తర్సేమ్ సింగ్ అనే వ్యక్తికి చెందినదని జస్పాల్ సింగ్ తెలిపారు. శిథిలాల కింద నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!