Gujarat : నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి… విచారణకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat : గుజరాత్లోని ఓ యూనివర్సిటీలో ఐదుగురు విదేశీ విద్యార్థులపై దాడి ఘటన వెలుగు చూసింది. ఈ విద్యార్థులు ఉజ్బెకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందినవారు. ఈ విద్యార్థులు అహ్మదాబాద్లోని హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేస్తున్నారు. దీంతో కోపోద్రిక్తులైన కొందరు విద్యార్థులు దీనిపై నిరసనకు దిగారు. దీంతో గొడవ చెలరేగింది. బయటి నుంచి వచ్చిన కొందరు తమ హాస్టల్ భవనంలోకి అకస్మాత్తుగా ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేయడం ప్రారంభించారని విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. హాస్టల్లో నమాజ్ చేయడానికి కూడా ఆ విద్యార్థులకు అనుమతి లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు మొదలయ్యాయి.
Read Also:Top Headlines @1PM : టాప్ న్యూస్
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మా హాస్టల్ ప్రాంగణానికి బయటి నుంచి దాదాపు 10-15 మంది వచ్చినట్లు ఆఫ్ఘన్ విద్యార్థి పేర్కొన్నారు. మేము నమాజ్ చేస్తుండగా ముగ్గురు మా హాస్టల్ భవనంలోకి ప్రవేశించారు. మేము ఇక్కడ నమాజ్ చేయకూడదని చెప్పి జై శ్రీరామ్ నినాదాలు చేయడం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును తోసి నమాజ్ చేస్తున్న వారిపై దాడి చేశారు. తమ గదులను ధ్వంసం చేశారని, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, అద్దాలు కూడా పగలగొట్టారని విద్యార్థులు తెలిపారు.
Read Also:IPL 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఐపీఎల్ ప్రదర్శనే కీలకం కాదు!
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి దుండగులు పరారయ్యారని తెలిపారు. విదేశీ విద్యార్థులపై దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం, కనీసం ఐదు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. గుజరాత్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నీర్జా గుప్తా సెల్ ఫోన్ కు కాల్ చేసినా స్పందించలేదు. గుజరాత్ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పిఐ ఎస్ ఆర్ బావా మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఈ దశలో మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. గాయపడిన ఐదుగురు విద్యార్థులను ఎస్వీపీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ వ్యవహారంపై సమాచారం అందిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా విచారణకు ఆదేశించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!