Gujarat : నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి… విచారణకు ఆదేశం
Gujarat : గుజరాత్లోని ఓ యూనివర్సిటీలో ఐదుగురు విదేశీ విద్యార్థులపై దాడి ఘటన వెలుగు చూసింది. ఈ విద్యార్థులు ఉజ్బెకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందినవారు. ఈ విద్యార్థులు అహ్మదాబాద్లోని హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేస్తున్నారు. దీంతో కోపోద్రిక్తులైన కొందరు విద్యార్థులు దీనిపై నిరసనకు దిగారు. దీంతో గొడవ చెలరేగింది. బయటి నుంచి వచ్చిన కొందరు తమ హాస్టల్ భవనంలోకి అకస్మాత్తుగా ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేయడం ప్రారంభించారని విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. హాస్టల్లో నమాజ్ చేయడానికి కూడా ఆ విద్యార్థులకు అనుమతి లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు మొదలయ్యాయి.
Read Also:Top Headlines @1PM : టాప్ న్యూస్
Also Read
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మా హాస్టల్ ప్రాంగణానికి బయటి నుంచి దాదాపు 10-15 మంది వచ్చినట్లు ఆఫ్ఘన్ విద్యార్థి పేర్కొన్నారు. మేము నమాజ్ చేస్తుండగా ముగ్గురు మా హాస్టల్ భవనంలోకి ప్రవేశించారు. మేము ఇక్కడ నమాజ్ చేయకూడదని చెప్పి జై శ్రీరామ్ నినాదాలు చేయడం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును తోసి నమాజ్ చేస్తున్న వారిపై దాడి చేశారు. తమ గదులను ధ్వంసం చేశారని, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, అద్దాలు కూడా పగలగొట్టారని విద్యార్థులు తెలిపారు.
Read Also:IPL 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఐపీఎల్ ప్రదర్శనే కీలకం కాదు!
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి దుండగులు పరారయ్యారని తెలిపారు. విదేశీ విద్యార్థులపై దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం, కనీసం ఐదు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. గుజరాత్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నీర్జా గుప్తా సెల్ ఫోన్ కు కాల్ చేసినా స్పందించలేదు. గుజరాత్ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పిఐ ఎస్ ఆర్ బావా మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, ఈ దశలో మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. గాయపడిన ఐదుగురు విద్యార్థులను ఎస్వీపీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ వ్యవహారంపై సమాచారం అందిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి కూడా విచారణకు ఆదేశించారు.
తాజావార్తలు
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
-
KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!